ఆ నగరాల్లో మరీ ప్రమాదకరం: కేంద్రం హెచ్చరిక
ముంబయి, పుణె, ఇండోర్, జైపుర్, కోల్కతా, పశ్చిమ్బంగాలోని మరికొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘిస్తే, సరైన చర్యలు తీసుకోకుంటే నావెల్ కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తుందని హెచ్చరించింది.....
మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ్ బంగా, మధ్యప్రదేశ్కు లేఖ
నిబంధనలు పాటించకపోతే ప్రజా సంక్షేమానికి ముప్పు
ముంబయి: ముంబయి, పుణె, ఇండోర్, జైపుర్, కోల్కతా, పశ్చిమ్బంగాలోని మరికొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘిస్తే, సరైన చర్యలు తీసుకోకుంటే నావెల్ కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తుందని హెచ్చరించింది.
కొవిడ్-19పై పోరాడుతున్న వైద్యులు, వైద్య సహాయకులపై దాడులు చేస్తున్నారని, వ్యక్తిగత దూరం నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘటనలను ఉదహరిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. వెంటనే వీటిని అడ్డుకోవాలని సూచించింది. సోమవారం మధ్యాహ్నానికి దేశంలో 17,265 మందికి కొవిడ్ సోకగా 543 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్లోని ఇండోర్, మహారాష్ట్రలోని ముంబయి, పుణె, రాజస్థాన్లోని జైపుర్, పశ్చిమ్బంగాలోని కోల్కతా, హౌరా, తూర్పు మేదినిపుర్, ఉత్తర 24 పరగణాలు, డార్జిలింగ్, కలింపాంగ్, జల్పాయ్గుడిలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని కేంద్రం తెలిపింది. ‘లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నివేదికలు అందాయి. ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరం. వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది’ అని వెల్లడించింది.
ఒక్క మహారాష్ట్రలోనే 4,203 కొవిడ్-19 కేసులు నమోదవ్వగా 223 మంది మరణించారు. రాజస్థాన్లో 1,478 (14 మరణాలు), పశ్చిమ్ బంగాలో 339 (12 మరణాలు) కేసులు నమోదవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు ఆరు అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందాలు (ఐఎంసీటీ) ఏర్పాటు చేశామని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ్బంగాలో వీరు అవసరమైన దిశానిర్దేశం చేస్తారని వెల్లడించింది. ప్రజా ప్రయోజనార్థం ఈ బృందాలు తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తాయని స్పష్టం చేసింది.
‘మార్గనిర్దేశాల ప్రకారం లాక్డౌన్ నిబంధనల అమలు, నిత్యావసర సరుకుల పంపిణీ, వ్యక్తిగత దూరం, వైద్యపరమైన మౌలిక సదుపాయాల సంసిద్ధత, వైద్యులు, వైద్యసిబ్బంది భద్రత, సహాయ కేంద్రాల్లో కూలీలు, పేద ప్రజల యోగ క్షేమాలను ఈ బృందాలు పర్యవేక్షస్తాయి’ అని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడులో వైద్యసిబ్బంది, పోలీసులపై దాడి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు