ఉగ్రవాదంలాగే కరోనాపై కలిసి పోరాడదాం

ఉగ్రవాదంలానే కరోనాపై కూడా కలిసి పోరాడదామని ప్రధాని నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్‌కు పిలుపునిచ్చారు. భారత్‌ ఇటీవల ఆ దేశానికి ఔషధాలు, గోదుమలు సరఫరా చేసిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ గనీ ట్విటర్‌ వేదికగా.....

Published : 21 Apr 2020 00:59 IST

అష్రఫ్‌ గనీ ట్వీట్‌కు మోదీ స్పందన

దిల్లీ: ఉగ్రవాదంలానే కరోనాపై కూడా కలిసి పోరాడదామని ప్రధాని నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్‌కు పిలుపునిచ్చారు. భారత్‌ ఇటీవల ఆ దేశానికి ఔషధాలు, గోదుమలు సరఫరా చేసిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ గనీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దానికి స్పందనగా మోదీ సోమవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. న్యూదిల్లీ, కాబుల్‌ మధ్య ప్రత్యేక మైత్రి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదంపై పోరాడినట్లు గుర్తుచేశారు. అదే రీతిలో కరోనాపై పోరాడదామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు