సరిహద్దుల్లో నక్కిన 300 మంది ఉగ్రవాదులు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ తీవ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం..  ..

Updated : 27 Apr 2020 08:05 IST

కశ్మీర్‌లోకి చొరబడేందుకు యత్నాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ తీవ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం..  పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ప్రస్తుతం 16 ఉగ్ర స్థావరాలు యాక్టివ్‌గా ఉన్నాయని.. వాటిలో జైషే మొహమ్మద్‌, లష్కరే తొయిబా తదితర నిషేధిత సంస్థలకు చెందిన దాదాపు 300 మందికిపైగా ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.  పాకిస్థాన్‌ ఆర్మీ సైతం వారికి అండగా నిలుస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో చొరబాట్లను కట్టడి చేసేందుకు భారత సైన్యం కూడా తనదైన వ్యూహాలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. కరోనా నేపథ్యంలో గస్తీ నిర్వహించే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చొరబాటుదారులకు కరోనా ఉండే అవకాశాలు లేకపోలేవని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని