మే 3 తర్వాత ఏం చేద్దాం? సీఎంలతో ప్రధాని 

కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో

Updated : 27 Apr 2020 13:34 IST

దిల్లీ: కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్‌లో కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలు, ఆంక్షలపై చర్చిస్తున్నారు. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రధాని సీఎంలతో చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే, మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పలు రాష్ట్రాలు కోరుతున్న వేళ ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కీలకంగా చర్చిస్తున్నారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని, ఆర్థిక సాయం అంశాలను పలు రాష్ట్రాలు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. దశల వారీగాలాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు 27,892 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 872 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎంలతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని