లాక్‌డౌన్‌ను పొడిగించిన పంజాబ్‌

పంజాబ్‌లో మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బుధవారం వెల్లడించారు. కరోనా వైరస్‌ను పూర్తిగా......

Published : 30 Apr 2020 01:37 IST

దిల్లీ: పంజాబ్‌లో మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బుధవారం వెల్లడించారు. కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో పంజాబ్‌లో మే 3వ తేదీ నుంచి మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. ఈ మేరకు సీఎం వీడియో సందేశంలో మాట్లాడుతూ.. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రతిరోజూ కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం మార్గదర్శకాలను జారీ చేసింది. సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులను కచ్చితంగా వాడాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని