కేరళ: ‘జీతాల్లో కోత’ ఆర్డినెన్స్‌కు ఆమోదం!

కేరళ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌కు తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది.

Published : 30 Apr 2020 15:38 IST

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌కు తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించిన కేరళ ప్రభుత్వం వారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఆరు రోజుల చొప్పున ఐదు నెలల పాటు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో సమస్య హైకోర్టుకు చేరింది.

దీనిపై వాదనలు విన్న కేరళ హైకోర్టు స్టే విధించింది. అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రంలోని విపక్షాలు వ్యతిరేకించాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని విపక్ష పార్టీలు ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని గవర్నర్‌ను కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌కు కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా దాదాపు 2వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆదా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కోత కేవలం వాయిదా మాత్రమేనని..ఉద్యోగులకు వీటిని తిరిగి చెల్లిస్తామని కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్‌ ఇసాక్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

భారత్‌లో కరోనా: 33వేల కేసులు, 1074మరణాలు

స్వీడన్‌ రూటే సపరేటు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని