ఫోన్ కొంటే ఆరోగ్యసేతులో నమోదు తప్పనిసరి
దిల్లీ: ఇక మీదట కొత్త మొబైల్ ఫోన్ వినియోగించే వారు విధిగా తమ వివరాలను ఆరోగ్య సేతు యాప్లో రిజిష్టర్ చేసుకోవాలట. లాక్డౌన్ తర్వాత దేశంలో అమ్ముడయ్యే ప్రతి స్మార్ట్ఫోన్లో ముందస్తు సేవల కింద ఆరోగ్య సేతు యాప్ ఉంటుందని సమాచారం. కొత్త ఫోన్ కొనుగోలు చేసినవారు దానిని ఉపయోగించడానికి ముందు యాప్లో తప్పనిసరిగా తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. త్వరలోనే కేంద్రం ఈ నిబంధనను అమలులోకి తేనుందట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఒక ఆంగ్ల వార్తా సంస్థకు తెలిపారు. దీని అమలు కోసం కేంద్రం త్వరలోనే కొత్త నోడల్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఏజెన్సీ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలతో సమయన్వయం చేసుకుంటూ, యాప్ను అన్ని స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటుందట.
ఈ మేరకు వినియోగదారులు తప్పనిసరిగా వివరాలు రిజిష్ట్రర్ చేసుకునే విధంగా ఫోన్లలో కూడా మార్పులు చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే అన్ని స్మార్ట్ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఇన్బిల్ట్ ఫీచర్ కింద అందివ్వనున్నారు. కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ఈ యాప్ను దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలానే కరోనా ముప్పుపై హెచ్చరించేందుకు ఫీచర్ ఫోన్ల కోసం కూడా కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. త్వరలోనే ఈ సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తేస్తామన్నారు.
ఇవీ చదవండి...
మోదీ ట్విటర్ అన్ఫాలోపై వైట్హౌజ్ క్లారిటీ!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్