అది నేను చెప్పింది కాదు: రతన్ టాటా
కరోనా నేపథ్యంలో తనకు ఆపాదిస్తూ వచ్చిన నకిలీ వార్తపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా స్పందించారు.
ముంబయి: కరోనా నేపథ్యంలో తనకు ఆపాదిస్తూ వచ్చిన నకిలీ వార్తపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా స్పందించారు. ట్విటర్ వేదిక ఆ వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ఈ విషయం తాను చెప్పలేదని పేర్కొన్నారు. ‘రతన్ టాటాస్ మెసేజ్: 2020 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సర్వైవల్, డోంట్ వర్రీ ఎబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్’ శీర్షికన ఓ కథనం వెలువడింది. అందులో రతన్ టాటా ఫొటో కూడా ఉంది. దీనిపై రతన్ టాటా స్పందిస్తూ ఈ కథనంతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తన పేరిట నకిలీ వార్తలు వస్తుండడంపై అసహనం వ్యక్తంచేశారు. గతంలో కూడా ఆయన ఓ వార్తా కథనంపై ఆయన ఇదే విధంగా స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. కరోనా ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనుందని నిపుణులు భావిస్తున్నారని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాన్ని ఆయన ఖండించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!