ఆ దేశాల్లో స్వల్ప మరణాలు.. ఎందుకంటే?
విశ్వవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది మృత్యువాతపడ్డారు. అగ్రరాజ్యంతో సహా ఎన్నో ధనిక దేశాలు కొవిడ్-19 మహమ్మారి ధాటికి కకావికలం అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విశ్వవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మందికిపైగా మృత్యువాతపడ్డారు. అగ్రరాజ్యంతో సహా ఎన్నో ధనిక దేశాలు కొవిడ్-19 మహమ్మారి ధాటికి కకావికలం అవుతున్నాయి. ముఖ్యంగా అక్కడి కొవిడ్-19 మరణాల రేటు ప్రపంచాన్నే దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. కొన్ని ధనిక దేశాల్లో అత్యధికంగా 10శాతానికి పైగా మరణాల రేటు ఉండగా, భారత్తో పాటు మరికొన్ని దేశాల్లో దాదాపు 3శాతంగా ఉంది. ఇలాంటి సమయంలో సింగపూర్, ఖతార్లలో కొవిడ్ మరణాల రేటు కేవలం 0.1శాతం కంటే తక్కువగా ఉంది. ఈ రెండు దేశాలు మాత్రం అత్యల్పంగా కొవిడ్-19 మరణాల రేటు నమోదుచేయడం గమనార్హం.
సింగపూర్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉన్పప్పటికీ మరణాల రేటు మాత్రం తక్కువగానే ఉంది. ఇప్పటివరకు సింగపూర్లో 19వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా మరణాల రేటు 0.09శాతం ఉంది. మరో సంపన్న దేశమైన ఖతార్లో 16వేల పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా కేవలం 12మంది మాత్రమే మృత్యువాతపడ్డారు. ఇక్కడ మరణాల రేటు 0.07శాతం కన్నా తక్కువగా ఉంది. కరోనా తీవ్రత కొనసాగుతున్న దేశాల్లో ఈ వైరస్ బారినపడిన యువకులతోపాటు అన్ని వయసుల వారు బలౌతున్నారు. ఇలాంటి సందర్భంలో సింగపూర్లో కరోనా వైరస్ సోకిన 102 సంవత్సరాల మహిళ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం విశేషం.
ఈ రెండు దేశాలు కూడా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలు కావడంతో కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో సఫలీకృతమైనట్టు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కేవలం సంపన్న దేశాలే కాక ఆయా దేశాల్లో ఉన్న మెరుగైన ఆరోగ్య వ్యవస్థ కారణంగా ఎక్కువ మంది వైరస్ బారిన పడినప్పటికీ మరణాల రేటు తక్కువ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ఈ దేశాలు ముందస్తుగానే టెస్ట్కిట్లను అందుబాటులో ఉంచుకోని.. ఆసుపత్రుల్లో తగినన్ని పడకలను సిద్ధం చేసుకున్నాయి. దీంతో కేసుల సంఖ్య పెరుగుతున్పప్పటికీ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తూ మరణాల రేటును తగ్గిస్తున్నాయి. యూఏఈలో ఇప్పటివరకు 12లక్షల పరీక్షలు నిర్వహించగా.. జనాభా తక్కువ ఉన్న సింగపూర్లోనూ ఇప్పటికే లక్షా నలభైవేలు టెస్టులు నిర్వహించారు.
అయితే, ఆయా దేశాల్లో ఉన్న టెస్టింగ్, జనాభా, వయసు, ఐసీయూల సామర్థ్యంపైనే ఈ మరణాల రేటు ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ఏ దేశమైతే ఎక్కువ పరీక్షలు నిర్వహించి, తక్కువ తీవ్రత ఉన్న రోగులను కూడా గుర్తిస్తున్నాయో ఆ దేశాల్లో మాత్రమే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు న్యూ సౌత్వేల్స్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త రైనా మాక్ఇంటైర్ వెల్లడించారు. వయసు పైబడిన జనాభా ఎక్కువగా ఉన్న దేశాలతోపాటు ఐసీయూలు, వెంటిలేటర్ల కొరత ఉన్నదేశాల్లో మాత్రం మరణాల రేటు ఎక్కువగా ఉందని మాక్ఇంటైర్ అభిప్రాయపడ్డారు. అయితే సింగపూర్లో వృద్ధ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ వైరస్ బారిన పడుతున్నది మాత్రం విదేశాల నుంచి వచ్చిన యువకులే. అయితే ఆ దేశంలోకి ప్రవేశించే సమయంలోనే అక్కడి ప్రభుత్వం వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తోంది. ఇక ఖతార్, యూఏఈలు కూడా తమ దేశంలోకి ప్రవేశించే వారికి కచ్చితంగా వైద్యపరీక్షలు నిర్వహించడం వల్లే వైరస్ను ఆదిలోనే గుర్తిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా ముందస్తు జాగ్రత్తలు, మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు వైరస్ను సమర్థమంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్