పాకిస్థాన్, చైనా చేతిలో బందీనే!
పాకిస్థాన్కు ఓవైపు అమెరికాతో బీటలువారుతున్న సంబంధాలు, మరోవైపు చైనాతో వ్యాపార, వ్యూహాత్మక ఒప్పందాలతో ధృడపడుతున్న పరిస్థితులు చూస్తుంటే, పాకిస్థాన్ కేవలం చైనాలో ఒక కాలనీ కంటే ఎక్కువేమీ కాదని అమెరికా అభిప్రాయపడింది.
అమెరికా రక్షణ విభాగం మాజీ అధికారి
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్కు ఓవైపు అమెరికాతో బీటలువారుతున్న సంబంధాలు, మరోవైపు చైనాతో వ్యాపార, వ్యూహాత్మక ఒప్పందాలతో ధృడపడుతున్న పరిస్థితులు చూస్తుంటే, పాకిస్థాన్ కేవలం చైనాకు ఒక కాలనీ కంటే ఎక్కువేమీ కాదని అమెరికా అభిప్రాయపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో అమెరికా సత్సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్, చైనాతో చేతులు కలిపిందని అమెరికా రక్షణ విభాగమైన పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వెల్లడించారు. చైనా పాకిస్థాన్ను ఒక వ్యాపార భాగస్వామిగా చూడడంలేదనే విషయాన్ని పాకిస్థాన్ తొందరలోనే గుర్తిస్తుందని మైఖేల్ రూబిన్ పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ‘ది నేషనల్ ఇంటెరెస్ట్’లో ప్రచురితమైన వ్యాసంలో రూబిన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంలో పాకిస్థాన్ తాను చేసిన తప్పిదాన్ని తొందరలోనే తెలుసుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా లక్షలమంది ముస్లింలను చైనా వివిధ క్యాంపులలో ఉంచిది. ఆ దేశంలో ఉన్న పాకిస్థానీలను అవమానపరచినా, హింసించినా పట్టించుకోని చైనాతో తాము బలమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామనే విషయాన్ని తొందరలోనే పాకిస్థాన్ తెలుసుకుంటుందని తన వ్యాసంలో పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తోన్న తరుణంలో తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వైరస్ను కట్టడి చేయడంలో పాకిస్థాన్ విఫలమైంది. ముఖ్యంగా పాకిస్థాన్కు రోడ్డు రవాణా సదుపాయంతో పాటు చైనాకు అతిపెద్ద రవాణా మార్గంగా మారబోయే చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్(సీపెక్)లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వైరస్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఈ కారిడార్లో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్, పీఓకే, పంజాబ్, సింధ్తోపాటు బలూచిస్థాన్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో చైనా నుంచి వాణిజ్య రవాణా ప్రారంభమైతే ఈ వైరస్ తీవ్రత కార్చిచ్చులా వ్యాపిస్తుందనే భయం వీరిలో వ్యక్తమవుతున్నట్లు రూబిన్ వెల్లడించారు.
ఈ కారిడార్ కోసం పనిచేస్తున్న చైనా కార్మికులు నూతన సంవత్సర వేడుకల కోసం తమ దేశానికి వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. చైనాలో కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని అక్కడి ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం పదినుంచి పదిహేను వేల మంది సీపెక్ కోసం పనిచేసే కార్మికులు తిరిగి పాకిస్థాన్కు చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు చైనా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికే గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో కరోనా వైరస్ ఎక్కువగా ఉంది. కేవలం ఈ ప్రాంతంలో రోజుకు 15మందికి వైద్య పరీక్షలు నిర్వహించగల ఒకే ఒక్క టెస్టింగ్ సెంటర్ ఉంది. అంతేకాకుండా 200 వెంటిలేటర్లు కావాలని అక్కడి వైద్యులు కోరినప్పటికీ కేవలం తొమ్మిది మాత్రమే అందుబాటులో ఉండడం అక్కడి పరిస్థితికి అద్ధం పడుతోంది. తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ పాకిస్థాన్ అధికారులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రూబిన్ పేర్కొన్నారు.
ఇక ఈ వైరస్ చైనాలోని వుహాన్లో పుట్టినట్లుగా భావిస్తున్నప్పటికీ చైనా దీనిపై భిన్నవాదనలు వినిపిస్తోంది. అంతేకాకుండా అక్కడి బాధితులు, మరణాల సంఖ్యను ప్రకటించడంలో ఊడా విఫలం చెందింది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడితోపాటు అక్కడి అధికారులు చైనాపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో పాకిస్థాన్ను చైనా వ్యాపార భాగస్వామిగా చూడడం లేదనే విషయాన్ని అమెరికా అధికారులు మరోసారి నొక్కిచెబుతున్నారు. ఇలా ఎన్నో అనుమానాలకు కారణామైన చైనాను పాకిస్థాన్ మాత్రం బలంగా నమ్ముతోంది. ఇదే విషయాన్ని రానున్న రోజుల్లో పాకిస్థాన్ తెలుసుకుంటుందని మైఖేల్ రూబిన్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, పాకిస్థాన్లో ఇప్పటివరకు 22వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 500మంది మృత్యువాతపడ్డారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.