548 వైద్యులు, నర్సులు, పారామెడిక్స్కు కరోనా
కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 548 వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. వీరికి వైరస్ ఎలా సోకిందో ఇంకా తెలియదని అధికారులు అంటున్నారు. వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆస్పత్రి సిబ్బందే కావడం గమనార్హం.....
ముంబయి: కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 548 వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. వీరికి వైరస్ ఎలా సోకిందో ఇంకా తెలియలేదని అధికారులు అంటున్నారు. వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆస్పత్రి సిబ్బందే కావడం గమనార్హం.
ఆస్పత్రుల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది, వార్డు బాయ్స్, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బంది, ప్రయోగశాల సహాయకులు, ఫ్యూన్లు, వస్త్రాలు శుభ్రం చేసేవారు, వంటచేసే సిబ్బంది ఈ లెక్కల్లో లేరని అధికారులు వెల్లడించారు. దిల్లీలోనే ఎక్కువ మంది వైద్యసిబ్బందికి కొవిడ్-19 సోకింది.
‘ఎవరి వల ఎలా, ఎవరి ద్వారా సోకిందో ఇంకా దర్యాప్తు చేయలేదు. అంటే ఆస్పత్రుల్లో సోకిందా బయట సోకిందా తెలియదన్నమాట. దిల్లీలోనే 69 మంది వైద్యులకు కొవిడ్-19 సోకింది. వీరే కాకుండా 274 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందీ ఈ జాబితాలో ఉన్నారు’ అని అధికారులు వెల్లడించారు.
సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో ఏడుగురు రెసిడెంట్ డాక్టర్లు, ఒక ప్రొఫెసర్ సహా 13 మందికి కొవిడ్-19 సోకింది. ఎయిమ్స్లో 10 మంది వైద్యసిబ్బందికి కరోనా వచ్చింది. వీరే కాకుండా దిల్లీలోని చాలా ఆస్పత్రుల్లో బాధితులు ఉన్నారు. కాగా దేశవ్యాప్తంగా 49,391 మందికి వైరస్ సోకగా 1,694 మంది మృతిచెందారు.
ఇవీ చదవండి
ఆ వీరపత్ని కన్నీటికి అర్థమేంటి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!