పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌ క్రాష్‌!

కరోనావైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించిన విషయం తెలిసిందే.

Published : 06 May 2020 18:46 IST

దిల్లీ: కరోనావైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌కు భారీ రద్దీ పెరిగింది. విమానాల సమాచారం కోసం విదేశాల్లో ఉన్న వారు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి వైబ్‌సైట్‌ క్రాష్‌ అయినట్లు అధికారులు ప్రకటించారు. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించేందుకు ఎన్‌ఐసీ విభాగం పనిచేస్తోందని విమానయాన మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో ప్రకటించింది. విదేశాల నుంచి భారతీయులను తరలించేందుకు ఏర్పాటు చేసిన విమాన వివరాలను ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. విదేశాల్లో ఉన్న దాదాపు 15వేల మందిని తరలించేందుకు భారత ప్రభుత్వం 64విమానాలు సిద్ధం చేసింది. స్వదేశానికి ఈ తరలింపు ప్రక్రియ దాదాపు వారం రోజులపాటు సాగనుంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని