లండన్ నుంచి భారత్ చేరుకున్న 326 మంది
కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన ఆంక్షల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది.........
ముంబయి: కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన ఆంక్షల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా బ్రిటన్ రాజధాని లండన్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ముంబయికి చేరుకుంది. ఆదివారం వేకువజామున ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిరిండియా 130, బోయింగ్ 777 విమానం.. 326 మంది భారతీయుల్ని స్వదేశానికి చేర్చింది. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ఎయిరిండియా సిబ్బందికి, ప్రభుత్వానికి ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం భారత్ చేరుకున్న వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఏమాత్రం లక్షణాలు ఉన్నా ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. మిగిలిన వారిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచనున్నామన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని వారి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. అంతకుముందు, 163 మందితో కూడిన ఎయిరిండియా విమానం కువైట్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న విషయం తెలిసిందే. అలాగే కువైట్, ఒమన్, మస్కట్ నుంచి రెండు విమానాలు నిన్న సాయంత్రం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా