భారత సరిహద్దులో చైనా హెలికాప్టర్ల చక్కర్లు!
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. సిక్కీంలోని నకులా సెక్టార్లో జరిగిన ఈ సంఘటన మరువక ముందే లద్దాఖ్ ప్రాంతంలో చైనా బలగాలు మరోసారి ప్రత్యక్షమయ్యాయి.
దిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. సిక్కింలోని నకులా సెక్టార్లో జరిగిన సంఘటన మరువక ముందే లద్దాఖ్ ప్రాంతంలో చైనా బలగాలు మరోసారి ప్రత్యక్షమయ్యాయి. లద్దాఖ్లోని వాస్తవాదీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో చైనా సైనిక బలగాలు హెలికాప్టర్లతో చెక్కర్లు కొట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో అప్రమత్తమైన భారత వైమానిక దళం ఫ్లైటర్ జెట్లతో తిప్పికొట్టింది. గతకొన్నిరోజుల క్రితం నకులా సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం సమయంలోనే ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. భారత్ను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఎల్ఏసీని దాటి భారత్ భూభాగంలోకి రాలేదని భారత అధికారులు స్పష్టంచేశారు. సాధారణంగా భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30ఎంకేఐ యుద్ధ విమానాలు సాధారణంగా లద్దాఖ్ ఎయిర్ బేస్ను ఉపయోగించుకుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!