వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!
కొవిడ్-19 లాక్డౌన్ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ) ఆదేశించింది......
ఇంజినీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు
దిల్లీ: కొవిడ్-19 లాక్డౌన్ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ) ఆదేశించింది. ఫిబ్రవరి, మార్చి నెలలకు కూడా వేతనాలు చెల్లించలేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన వేళ ఏఐసీటీఈ స్పందించి ఈ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంక్షోభం కొనసాగుతున్న వేళ యాజమాన్యాల వేతనాల కోత నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఏఐసీటీఈ ఛైర్మన్ అనిల్ సహస్రబుద్ధే కాలేజీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో అందరికీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే ఫీజుల చెల్లింపుల విషయంలో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని గత నెలలోనే ఏఐసీటీఈ కాలేజీలను ఆదేశించింది. ఉద్యోగులను సైతం విధుల్లో నుంచి తొలగించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అందిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఏఐసీటీఈ సంస్థలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలో కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 16న అన్ని విద్యాసంస్థల్ని మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత మార్చి 24న దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను పలు దశల్లో మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె