నగరాల్లోనే నంబరెక్కువ!
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య 75వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 2,415కి చేరింది. ఎక్కువగా కేసులు నమోదైన దేశాల్లో చైనాలో 11వ స్థానంలో ఉండగా.. భారత్ 12వ....
కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ
ఇంటర్నెట్డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య 75వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 2,415కి చేరింది. ఎక్కువగా కేసులు నమోదైన దేశాల్లో చైనాలో 11వ స్థానంలో ఉండగా.. భారత్ 12వ స్థానంలో ఉంది. రోజుకు 3వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని మనం దాటేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నాలుగైదు రాష్ట్రాల్లోనే ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. అందులోనూ ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం గమనార్హం. రాష్ట్రంలో తీవ్రంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాల పరిస్థితిని గమనించినప్పుడు ఈ పరిస్థితి అర్థమవుతుంది.
మహారాష్ట్రకు ముం‘భయం’
మొదటి నుంచీ ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ కేసుల సంఖ్య 25 వేల మార్కుకు చేరువైంది. 921 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 5,125 మంది కోలుకున్నారు. ఆ రాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి వరకు 14,781 కేసులు నమోదయ్యాయి. 556 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలోని 60 శాతం కేసులు ఇక్కడివే కావడం గమనార్హం. మహారాష్ట్రలోని మరో నగరం పుణెలో సైతం కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ 2,937 కేసులు నమోదు అవ్వగా.. 12 మంది మరణించారు.
దిల్లీని వీడని కేసులు
దేశ రాజధానిని కొవిడ్-19 మహమ్మారి వీడడం లేదు. విదేశీ ప్రయాణికుల రాకతో తొలుత దిల్లీలో కేసులు వెలుగుచూడగా.. అనంతరం తబ్లిగీ జమాత్ సమ్మేళనం దిల్లీలో కేసుల పెరుగుదలకు కారణమైంది. ఇప్పటికీ అక్కడ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం 7,639 కేసులతో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 86 మంది మరణించారు. కేసుల సంఖ్యతో పోలిస్తే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఊరట కల్పించే విషయం.
గుజరాత్కు అహ్మదా‘బాధ’
కరోనా కేసుల పరంగా దేశంలో గుజరాత్ రెండోస్థానంలో నిలిచింది. ముఖ్యంగా అహ్మదాబాద్ నుంచే ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో 8,903 కేసులు నమోదు అవ్వగా.. 537 మరణాలు సంభవించాయి. అందులో ఒక్క అహ్మదాబాద్ నుంచే 6,353 కేసులు నమోదు కాగా.. 421 మరణాలు అక్కడే సంభవించడం గమనార్హం. రాష్ట్రంలోని దాదాపు 70 శాతం కేసులు ఒక్క అహ్మదాబాద్లోనే నమోదు అవుతున్నాయి. పైగా అక్కడ మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండడంతో ఇటీవలే దిల్లీ ఎయిమ్స్కు చెందిన నిపుణులు అక్కడి కొవిడ్-19 ఆస్పత్రులను సందర్శించారు. వైద్యులకు సూచనలు చేశారు.
చెన్నై కోయం‘బ్లేడు’
తొలినాళ్లలో మర్కజ్.. ఇప్పుడు కోయంబేడు మార్కెట్ తమిళనాడు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఈ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. దిల్లీ మర్కజ్కు వెళ్లి వచ్చిన వారి వల్ల తొలినాళ్లలో అత్యధిక కేసులతో తమిళనాడు తల్లడిల్లింది. వాటిని కట్టడి చేసే లోపే చెన్నైలోని కోయంబేడు మార్కెట్ హాట్స్పాట్గా మారింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 8718 కేసులు నమోదు అవ్వగా.. 61 మరణాలు సంభవించాయి. అందులో 4,882 కేసులు ఒక్క చెన్నై నగరం నుంచే వెలుగు చూడడం గమనార్హం. మొత్తం కేసుల్లో సుమారు 56 శాతం ఈ నగరం నుంచే నమోదు అయ్యాయి.
కేసుల పరంగా ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్లో 4021 కేసులు నమోదు అవ్వగా..117 మరణాలు సంభవించాయి. అందులో 1281 కేసులు జైపూర్లో వెలుగుచూశాయి. అంటే దాదాపు 30 శాతానికి పైగా కేసులు ఇక్కడివే. ఇవి కాక మధ్యప్రదేశ్లోని ఇండోర్, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తెలంగాణ విషయానికొస్తే ఇటీవల కొత్తగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే వెలుగు చూస్తుండడం గమనార్హం.
ఆధారం: మంగళవారం రాత్రి వరకు ఉన్న డేటా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?