దేశంలో 20 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
దేశవ్యాప్తంగా గురువారం నాటికి ఇరవై లక్షల కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రకటించారు.
దిల్లీ: దేశవ్యాప్తంగా గురువారం నాటికి 20 లక్షలకుపైగా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. అంతేకాకుండా గత 45 రోజుల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని... గత 12 రోజుల్లోనే రెట్టింపు అయినట్టు ఆయన తెలిపారు. ‘‘మే నెలాఖరు నాటికి ఇరవై లక్షల కరోనా వైరస్ పరీక్షలు పూర్తచేయటమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే రెండు వారాలకు ముందే మా లక్ష్యాన్ని చేరుకున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 504 ప్రయోగశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 359 ప్రభుత్వానివి కాగా, 145 ప్రైవేటు ప్రయోగశాలలు. అంతే కాకుండా రోజుకు లక్ష కొవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగల సామర్ధ్యాన్ని కూడా మనం పెంపొందించుకున్నాం.’’ అని మంత్రి తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం...
> దేశంలో ప్రతి పదిలక్షల మందిలో 1540 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అమెరికా (31,080), స్పెయిన్ (52,781), రష్యా (42,403), బ్రిటన్ (32,691), ఇటలీ (45,246) వంటి దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే.
> కొవిడ్ కేసులు రెట్టింపు అయ్యే రేటు రెండువారాల క్రితం 11.1 రోజులుగా ఉండగా... ప్రస్తుతం అది పెరిగి 13.9 రోజులకు చేరింది.
> బుధవారం నాటికి కరోనా మరణాల రేటు 3.2 శాతంగా ఉండగా.. నయమైన రేటు 33.6 శాతంగా ఉంది.
> యాక్టివ్ కేసుల్లో 3 శాతం మంది ఐసీయూల్లో చికిత్స పొందుతుండగా.. 0.39శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారు.
> భారత్లో డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన ఆర్టీ-పీసీఆర్ విధానం ద్వారా కొవిడ్ను నిర్ధారిస్తున్నారు.
> ప్రస్తుత కరోనా కేసుల పెరుగుదల రేటుకు అనుగుణంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వనరులు మనవద్ద ఉన్నాయని ప్రధాని ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ సహాధ్యక్షుడు సీకే మిశ్రా తెలిపారు.
> సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో రోజుకు రెండులక్షలకు పైగా పరీక్షా కిట్లను తయారుచేయగల సామర్ధ్యాన్ని సాధించామని మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ఎండీ హస్ముఖ్ రావల్ తెలిపారు. కాగా దేశంలో పరీక్షా కిట్ల తయారీకి అనునమతులు పొందిన తొలి సంస్థ మైలాబ్ అనే సంగతి తెలిసిందే.
> ఇక రోజుకు 1200 కరోనా నమూనాలను పరీక్షించగల అత్యధిక సామర్ధ్యమున్న కోబాస్-6800 టెస్టింగ్ ప్లాట్ఫాం దిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ ఆధీనంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.