కరోనాపై పోరులో బ్రెజిల్కు మరో ఎదురుదెబ్బ..
కరోనా వైరస్తో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న బ్రెజిల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మారిపై పోరులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో నిర్ణయాలను వ్యతిరేకించి...
బ్రసీలియా: కరోనా వైరస్తో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న బ్రెజిల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మారిపై పోరులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో నిర్ణయాలను వ్యతిరేకించి గతనెల 16న ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన నెల్సన్ టీచ్ కూడా శుక్రవారం రాజీనామా చేయడం గమనార్హం. ఇలా ఒకే నెలలో ఇద్దరు ఆరోగ్య మంత్రులు రాజీనామా చేయడం బ్రెజిల్లో నెలకొన్న తీవ్ర పరిస్థితులకు అద్దంపడుతోంది. కరోనాపై పోరులో అధ్యక్షుడి విధానాలే ఈ రాజీనామాలకు కారణాలని నిపుణులు భావిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అధ్యక్షుడు పలు ఆంక్షలను సడలించారు. సెలూన్లు, బ్యూటీపార్లర్లు, పలు దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. వైరస్ పెరుగుతున్న వేళ బోల్సోనారో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో టీచ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా, ఆయన నిర్ణయాలను సమర్థించలేక టీచ్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఏదేమైనా ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో అక్కడ అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వగా, శుక్రవారం నాటికి 2 లక్షలు దాటాయి. దీంతో అత్యధిక కేసుల జాబితాలో జర్మనీ, ఫ్రాన్స్ దేశాలను బ్రెజిల్ దాటేసింది. అమెరికా తర్వాత ఒక్కరోజులో అధిక మొత్తంలో కేసులు నమోదవుతున్న దేశంగా అది నిలిచింది. మరోవైపు టీచ్ రాజీనామాకు సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా, అధ్యక్షుడు బోల్సోనారోకు సంబంధించిన ఓ ముఖ్య అధికారి ఈ విషయంపై స్పందించారు. టీచ్ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని, ఆ విషయాన్ని అధ్యక్షుడితోనూ చర్చించారని చెప్పారు. ఇప్పుడున్న తాత్కాలిక ఆరోగ్య మంత్రి ఎడ్వర్డో పజెల్లో పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టాలని కేబినెట్లోని సభ్యులు కోరారు.
ఆందోళన కలిగిస్తున్న కేసులు..
మరోవైపు దేశంలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. గత మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. నిన్న ఒక్కరోజే 14 వేల కేసులు పెరగ్గా తాజాగా మరో 15 వేల కేసులు నమోదయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇటలీ(2,24,000)ని దాటే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బ్రెజిల్లో 2,18,000 కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా వేల కేసులు పెరగడంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. రోజుకు సుమారు 800 మంది మరణిస్తున్నారు. దీంతో శ్మశానాల్లో సామూహిక ఖననాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు