కరోనా కేసుల్లో.. చైనాను దాటేసిన భారత్!
ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్కు పట్టినిళ్లైన చైనాలో వైరస్ తీవ్రత గణనీయంగా తగ్గింది. ఈ సమయంలో భారత్లో మాత్రం వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే భారత్లో 3970పాజిటివ్ కేసులు నమోదుకావడంతో పాజిటివ్ కేసుల సంఖ్యలో చైనాను దాటేసింది.
దిల్లీ: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి కేంద్రబిందువైన చైనాలో తాజాగా వైరస్ తీవ్రత గణనీయంగా తగ్గింది. ఈ సమయంలో భారత్లో మాత్రం ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశంలో 3970 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో కరోనా కేసుల సంఖ్యలో భారత్.. చైనాను దాటేసింది. ప్రస్తుతం చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,900కే పరిమితం కాగా భారత్లో మాత్రం 85,940కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్ 11వ స్థానానికి ఎగబాకగా..చైనా 13వ స్థానంలో నిలిచింది. అయితే వైరస్ కారణంగా సంభవించిన మరణాల్లో మాత్రం చైనా కంటే తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. భారత్లో ఇప్పటివరకు కొవిడ్ సోకి 2753మంది మరణించగా..చైనాలో 4633మంది ప్రాణాలు కోల్పోయారు.
గత సంవత్సరం డిసెంబరు నెలలో బయటపడిందని బావిస్తోన్న కరోనా వైరస్ చైనాలో విలయతాండవం చేసింది. తక్కువ సమయంలోనే వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేసి వేల సంఖ్యలో బాధితులుగా మార్చింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఊహించని విధంగా విజృంభించింది. అక్కడ ప్రతిరోజు సరాసరి 2400పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా మార్చి మొదటివారానికే చైనాలో 80వేల కేసుల మార్కును దాటింది. మార్చి చివరినాటికి మాత్రం పాజిటివ్ కేసులు పదుల సంఖ్యకు పడిపోయాయి. ఆ సమయంలో(మార్చి రెండో వారం) ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభించడం ప్రారంభించింది. అప్పుడు భారత్లో ఈ కేసుల సంఖ్య దాదాపు 100 మాత్రమే. ఇలా చైనాతో పోల్చుకుంటే 80వేలు దాటడానికి భారత్కి దాదాపు రెండు నెలల సమయం పట్టింది.
లాక్డౌన్తో కట్టడి..
భారత్లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు రెట్టింపు కావడానికి 11రోజులు పడుతోంది. లాక్డౌన్ విధించక ముందు పాజిటివ్ కేసుల సంఖ్య మూడున్నర రోజులకే రెట్టింపు అయ్యింది. లాక్డౌన్ సహాయంతో వైరస్ వ్యాప్తిని చాలావరకూ అరికట్టగలిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్లో ప్రస్తుతం 85,940 పాజిటివ్ కేసులు నమోదుకాగా 30,153మంది కోలుకున్నారు. భారత్లో రికవరీ రేటు 35శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనా వైరస్ను గుర్తించడం, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ వంటి చర్యలతో వైరస్ తీవ్రతను తగ్గించడానికి ఈ లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చైనాలో అక్కడి అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 80వేల మంది కోలుకోగా ఇది 94శాతంగా ఉంది. ఇక కొవిడ్-19 మరణాల రేటు చైనాలో 5.5శాతం ఉండగా భారత్లో 3.2గా ఉండటం ఊరట కలిగిస్తోంది.
ఇప్పటికే దేశంలో మూడుసార్లు లాక్డౌన్ పొడగించగా.. మే 17నాటికి ఇది ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగింపు మరోసారి ఉంటుందని భారత ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ సమయంలో లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూనే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న తరుణంలో భారత్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.