లాక్డౌన్ 4.0 గైడ్లైన్స్ ఇవే..
దేశవ్యాప్త లాక్డౌన్ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు
రాష్ట్రాల అనుమతి మేరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు
సినిమా హాళ్లు, షాషింగ్స్మాల్స్కు అనుమతి లేదు
రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగింపు
దిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలను హోంశాఖ విడుదల చేసింది. రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అదే సమయంలో కంటైన్మెంట్ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టంచేసింది.
లాక్డౌన్ 4.0 లో వీటికి అనుమతి లేదు
* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు.
* మెట్రో రైలు సేవలకు అనుమతి ఉండదు.
* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్ సెంటర్లు బంద్.
* హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు.
* సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు.
* రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు.
* మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు.
* కంటైన్మెంట్ జోన్లలో బస్సు సర్వీసులకు అనుమతి లేదు
లాక్డౌన్ 4.0 లో వీటికి గ్రీన్ సిగ్నల్
* ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు కిచెన్లు తెరిచేందుకు అనుమతులు.
* బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటీన్లు నడిపేందుకు అనుమతులు.
* వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్కేర్ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి ఉంటుంది.
* దేశీయంగా మెడికల్ సేవలు, దేశీయ ఎయిర్ అంబులెన్స్లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది.
* ప్రేక్షకులు లేకుండా క్రీడా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి
* ఆన్లైన్/డిస్టెన్స్ లెర్నింగ్ ఎప్పటిలాగే కొనసాగుతుంది.
బస్సు సర్వీలు అలా..
* రాష్ట్రాల మధ్య సమన్వయం మేరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహన ప్రయాణాలకు అనుమతి.
* అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకుంటాయి.
కంటైన్మెంట్, బఫర్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఇలా..
* ఎక్కడెక్కడ రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది.
* రెడ్, ఆరెంజ్, కంటైన్మెంట్, బఫర్ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి.
* కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు.
* కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి.
* 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, 10 ఏళ్లలోపు చిన్న పిల్లలను తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రానీయవద్దు.
రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేవలు మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్ అమలు చేయాలి.
ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
* ఆఫీస్లు, పని ప్రదేశాల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ఉద్యోగి ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకునేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి.
* స్మార్ట్ఫోన్ వినియోగదారులందరూ ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకునేలా జిల్లా అధికారులు అవగాహన కల్పించాలి.
సరకు రవాణకు అనుమతి
* నర్సులు, పారా మెడికల్ స్టాఫ్, పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్సులకు, ఔషధ నిపుణులకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లవచ్చు. వారికి ఎలాంటి నిబంధనలూ ఉండవు.
* వస్తు రవాణ, కార్గో సేవలు, చివరకు ఖాళీ ట్రక్కులను అన్ని రాష్ట్రాలు అనుమతించాలి. వీటికి అడ్డు చెప్పకూడదు.
* పొరుగు దేశాల ద్వారా వచ్చే వస్తువులు, కార్గో సేవలను అందిస్తున్న అన్ని వాహనాలను రాష్ట్రాలు అనుమతించాలి.
* డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఇవన్నీ అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వీటికి ఎలాంటి ఆటంకాలు కలిగినా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్లు తగిన చర్యలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్