చచ్చినా, బతికినా..గౌరవం మాత్రం లేదు
లాక్డౌన్ కారణంగా వలసకూలీలు పడుతున్న కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
శవాలు, గాయపడిన వ్యక్తులు ఒకే ట్రక్కులో..
లఖ్నవూ: లాక్డౌన్ కారణంగా వలసకూలీలు పడుతున్న కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇళ్లకు చేరుకొనే క్రమంలో వారికి ఎదురవుతున్న ప్రమాదాలు మృత్యుఒడికి చేర్చుతున్నాయి. చివరికి మృత దేహాల తరలింపులో అధికారుల నిర్లక్ష్య వైఖరి విమర్శలకు దారితీసింది.ఉత్తర్ప్రదేశ్లో ట్రక్లో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించినవారి మృతదేహాలతో కలిపి గాయపడిన వ్యక్తులను పంపుతున్నట్లు ఉన్న ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. మృత దేహాలను టార్పాలిన్ సంచుల్లో చుట్టి ఉంచినట్లు, వారి పక్కనే గాయాలతో ఉన్న కూలీలు కూర్చున్నట్లు ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. యూపీలోని ఔరయ వద్ద శనివారం ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ తరలింపు విధానంపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మా రాష్ట్రానికి చెందిన వలస కూలీలతో అంత క్రూరంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఝార్ఖండ్ సరిహద్దుల వరకైనా మృతదేహాలను తరలించడానికి సరైన రవాణా సౌకర్యం కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ఆ తర్వాత మేం కూలీల మృతదేహాలను వారి సొంత పట్టణం బొకారోకు మర్యాదపూర్వకంగా తరలిస్తాం’ అని సోరెన్ యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. యూపీ రాజధాని లఖ్నవూకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరయ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలో 26 మంది కూలీలు మరణించగా, 30 మంది గాయపడ్డారు. మరుసటి రోజు ఆ ఘటనలో మృతి చెందిన మృతదేహాలతో కలిపి, గాయపడిన ఇతర కూలీలను కూడా ఒకే ట్రక్లో తరలిస్తున్న చిత్రాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. చనిపోయిన వారిలో 11 మంది ఝార్ఖండ్కు చెందిన వారు కాగా, మిగిలిన వారు బెంగాల్ వాసులని అధికారులు తెలిపారు. అయితే సోరెన్ ట్వీట్తో అప్రమత్తమైన అధికారులు మృతదేహాలను అంబులెన్సులోకి మార్చారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఔరయా జిల్లా మేజిస్ట్రేట్ మీడియాకు తెలిపారు.
లాక్డౌన్ కారణంగా నగరాల్లో చిక్కుకుపోయిన కూలీలు ట్రక్కులు, టెంపోలు, ఆటోలు, సైకిళ్ల మీద, చివరికి నడుచుకుంటూ కూడా తమ గ్రామాలకు చేరుకోవాలని ప్రయత్నిస్తూ, చివరికి ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటన్నింటిని గమనించిన యూపీ ప్రభుత్వం వారిని స్వస్థలాలకు చేర్చడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే