కర్బన ఉద్గారాల్లో 26 శాతం తగ్గుదల
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు ఆరోగ్య రంగంతో పాటు ఆర్థిక రంగాన్నీ నిట్టనిలువునా ముంచేసింది. లక్షలాది మంది ప్రాణాల్ని బలితీసుకొని వేలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.........
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు ఆరోగ్య రంగంతో పాటు ఆర్థిక రంగాన్నీ నిట్టనిలువునా ముంచేసింది. లక్షలాది మంది ప్రాణాల్ని బలితీసుకొని వేలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. కానీ, కరోనా విజృంభణకు ముందు ప్రపంచాన్ని కలవరపెట్టిన వాతావరణ కాలుష్యాన్ని మాత్రం భారీగా తగ్గించింది. కరోనా చేసిన మేలేదైనా ఉందా అంటే.. అది ఇదొక్కటనే చెప్పాలి. లాక్డౌన్తో పాటు వివిధ దేశాల్లో విధించిన కఠిన ఆంక్షల వల్ల ప్రజారవాణా, పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో తగ్గాయి. బ్రిటన్కు చెందిన ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం..
> ‘నేషనల్ క్లైమేట్ ఛేంజ్’ జర్నల్లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం జనవరి-ఏప్రిల్ మధ్య ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు 17 శాతం మేర పడిపోయాయి. అదే భారత్లో ఈ తగ్గుదల 26 శాతంగా నమోదుకావడం గమనార్హం.
> 2020 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాల తగ్గుదల 4.4 శాతం నుంచి 8 శాతం వరకు ఉండొచ్చని అంచనా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయి వార్షిక తగ్గుదల ఇదే తొలిసారి.
> బ్రిటన్లో 30.7 శాతం, అమెరికాలో 31.6 శాతం, చైనాలో 23.9 శాతం మేర కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి.
> ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు తీవ్ర స్థాయిలో ఉన్న దశలో రోజువారీ ఉద్గారాల స్థాయి 17 శాతం మేర పడిపోయి 2006 నాటి స్థాయికి చేరాయి.
> రోడ్డు రవాణా వల్ల వెలువడే ఉద్గారాల్లో 43 శాతం తగ్గుదల నమోదైంది. ఇంధన ఉత్పత్తి వల్ల వచ్చే ఉద్గారాల్లో 19 శాతం, పరిశ్రమల కార్యకలాపాల వల్ల వెలువడే ఉద్గారాల్లో 25 శాతం, విమానయానం వల్ల ఉత్పత్తి అయ్యే ఉద్గారాలు 10 శాతం మేర తగ్గాయి.
> అయితే, ఇప్పటికే గణనీయంగా పేరుకుపోయిన ఉద్గారాల వల్ల తాజా తగ్గుదల వాతావరణ మార్పుల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. వాతారణ మార్పులను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రస్తుతం నమోదైన తగ్గుదల ఏమాత్రం సరిపోదు.
ఆర్థిక రంగాన్ని గాడినపెట్టాలన్న లక్ష్యంతో ఉద్గారాల తగ్గింపు విషయంలో రాజీపడకూడదని అధ్యయనం ఆయా దేశాలకు సూచించింది. కొవిడ్ సంక్షోభం తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామకం సహా ఇతర రంగాల పునరుత్తేజానికి రూపొందించే ప్రణాళికల్లో కర్బన ఉద్గారాల తగ్గింపును కూడా చేర్చాలని హితవు పలికింది. ముఖ్య రవాణా వల్ల వెలువడుతున్న ఉద్గారాల కట్టడికి సమగ్ర విధానం ఉండాలని సూచింది. కాలుష్య నివారణకు తాజా పరిస్థితుల్ని అవకాశంగా భావించాలే తప్ప అవరోధంగా కాదని హితవు పలికింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్