భారత్లో 5కోట్ల మంది హ్యాండ్వాష్కు దూరం..!
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భౌతిక దూరంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతే కీలకమని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంలో సబ్బు, స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేనికారణంగా అల్ప, మధ్యఆదాయ దేశాల్లోని దాదాపు 200కోట్ల మందిపై వైరస్ ప్రభావం ఉండే అవకాశం ఉందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యూవేషన్ (ఐహెచ్ఎంఈ) నివేదించింది.
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భౌతిక దూరంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతే కీలకమని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంలో సబ్బు, స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేనికారణంగా అల్ప, మధ్యఆదాయ దేశాల్లోని దాదాపు 200కోట్ల మందిపై వైరస్ ప్రభావం ఉండే అవకాశం ఉందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యూవేషన్ (ఐహెచ్ఎంఈ) నివేదించింది. ముఖ్యంగా ఆఫ్రికా, ఓషియానా ప్రాంతాల్లోని 50శాతానికి పైగా ప్రజలు చేతులు శుభ్రతకు దూరంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ సమయంలో భారత్లో దాదాపు 5కోట్ల మంది వ్యక్తిగత పరిశుభ్రతకు దూరంగా ఉన్నట్లు తాజా నివేదిక పేర్కొంది. వీరికి కనీసం చేతులు శుభ్రపరుచుకునే వీలులేదని తెలిపింది.
కొవిడ్-19 వ్యాప్తి నివారణలో చేతుల శుభ్రత ఎంతో ముఖ్యం. అయినప్పటికీ చాలా దేశాల్లో ఆరోగ్య రక్షణ వ్యవస్థలు స్వల్ప స్థాయిలో ఉన్నాయని ఐహెచ్ఎంఈ ప్రొఫెసర్ మైఖేల్ బ్రేయర్ స్పష్టం చేశారు. దాదాపు 46దేశాల్లో జరిపిన తాజా పరిశోధనలో దాదాపు సగం మంది ప్రజలు సబ్బు, స్వచ్ఛమైన నీటికి దూరంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, నైజీరియా, ఇథియోపియా, కాంగో, ఇండోనేషియాలలోనూ ఒక్కో దేశంలో దాదాపు 5కోట్లకుపైగా ప్రజలకు చేతులు శుభ్రం చేసుకునే అవకాశం లేదని నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం వాడుతున్న హ్యండ్ శానిటైజర్లు, నీటి ట్యాంకులు తాత్కాలికమేనని బ్రేయర్ అన్నారు. చేతులు శుభ్రతకు నోచుకోని కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 7లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. ఇలాంటి సందర్భంలో కొవిడ్ నుంచి రక్షించుకునేందుకు శాశ్వత ప్రణాళికలు అవసరమని స్పష్టం చేశారు.
1990 నుంచి 2019 వరకు చాలా దేశాల పరిస్థితిలో మెరుగైన మార్పు వచ్చినప్పటికీ.. ఇంకా ప్రపంచంలోని దాదాపు 25శాతం మంది వీటికి దూరంగా ఉన్నట్లు బ్రేయర్ పేర్కొన్నారు. సౌదీ అరేబియా, మొరాకో, నేపాల్, టాంజానియీ దేశాలు పారిశుద్ధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించాయని నిపుణులు వెల్లడించారు. అయితే వ్యక్తిగత పరిశుభ్రత గురించి మాత్రమే ఈ నివేదిక దృష్టి సారించగా.. పాఠశాలలు, పనిచేయు ప్రదేశాలు, మార్కెట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాలలో చేతుల శుభ్రతకు ఉన్న వసతుల గురించి ఈ నివేదిక దృష్టిసారించలేదు.
ఇదిలా ఉంటే, ఆఫ్రికా ఖండంలోనే దాదాపు నాలుగున్నర కోట్ల మంది కొవిడ్-19 బారినపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది. వీరిలో దాదాపు 1,90,000 మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు గతనెల డబ్ల్యూహెచ్ఓ అంచనాలను శాస్త్రవేత్తలు గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్