కరాచీలో కుప్పకూలిన విమానం
పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మోడల్ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్ ఎయిర్
ప్రమాద సమయంలో విమానంలో 99మంది
జనావాసాల మధ్య కూలడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం
కరాచీ: పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్థాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మలీర్లోని ఓ మోడల్ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్ ఎయిర్ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్ సత్తార్ ధ్రువీకరించారు. విమాన ప్రమాదం గురించి ఇప్పుడేమీ మాట్లాడలేమన్నారు. విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్లో శిక్షణ పొందినవారేనని చెప్పారు. ప్రమాద ఘటనపై సమాచారం అందించడంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. లాహోర్ నుంచి కరాచీకి వస్తున్న ఏ-320 విమానంలో 91 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. జనావాసాల మధ్య ఈ విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. రంజాన్ వేడుకలకు దేశమంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
కాసేపట్లో ల్యాండింగ్.. అంతలోనే విషాదం!
ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్యశాఖ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ విమానం జనావాసాల మధ్య కుప్పకూలడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విమానం కూలిపోయిన ప్రదేశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఒక నిమిషం వ్యవధిలో విమానం ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి
విమాన ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి వెళ్లిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సీఈవో అర్షద్ మాలిక్తో టచ్లో ఉన్నట్టు తెలిపారు. తక్షణమే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ట్విటర్లో పేర్కొన్నారు. మృతులకు తన సంతాపం తెలిపారు. అలాగే, ఈ ఘటనపై విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై తక్షణ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. మరోవైపు, పాకిస్థాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ ఘటనపై విచారం వ్యక్తంచేశారు. ఈ సమయంలో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్కు అండగా నిలిచి సహాయక చర్యల్లో తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
ఎంతమంది మరణించారో ఇప్పుడే చెప్పలేం!
ఈధి ఫౌండేషన్ అధికార ప్రతినిధి షాద్ ఈధి మాట్లాడుతూ.. విమానం నుంచి 13 మృతదేహాలను బయటకు తీసి సహాయక సిబ్బంది పలు ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నవారిలో దాదాపు 25 నుంచి 30మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తీసుకెళ్లారని వివరించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమంది మృతిచెందారనే విషయాన్ని మాత్రం ఇప్పట్లోనే చెప్పలేమన్నారు.
ఈ ఘటనపై సింధ్ ప్రాంత గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ స్పందించారు. విమానం జనావాసాల మధ్య కూలిపోవడంతో ఈ ప్రాంతంలో ఎంతమంది మృతిచెందారనే విషయంలో ఆందోళన నెలకొందన్నారు. సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపించామన్న ఆయన.. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)