ఆక్స్ఫర్డ్ టీకా మరో అడుగు ముందుకు..!
కరోనావైరస్కు టీకా విషయంలో కొన్ని సానుకూల పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఆక్స్ఫర్డ్ తయారు చేస్తున్న ChAdOx1 nCoV-19 టీకా రెండోదశలో భాగంగా విస్తృత ప్రయోగాలు మొదలు కానున్నట్లు
రెండో దశకు ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు
లండన్: కరోనావైరస్కు టీకా విషయంలో కొన్ని సానుకూల పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఆక్స్ఫర్డ్ తయారు చేస్తున్న ChAdOx1 nCoV-19 టీకా రెండోదశలో భాగంగా విస్తృత ప్రయోగాలకు అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టినట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. తొలిదశలో 1,000 మందికి ఇమ్యూనైజేషన్ చేసినట్లు పేర్కొంది. వారి ఫలితాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. ఇక రెండో దశలో 10,260 మందిపై దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. వీరిలో 56 ఏళ్లు పైబడిన వారు, 5-12ఏళ్ల మధ్య వారు ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది పూర్తయితే మూడో దశ కూడా మొదలుపెట్టనున్నట్లు ఆక్స్ఫర్డ్ తన వెబ్సైట్లో పేర్కొంది. దీనిలో 18ఏళ్లు పైబడిన వారిపై ప్రయోగించి ఎలా పనిచేస్తోందో తెలుసుకొంటారు.
ఏమిటీ ఆక్స్ఫర్డ్ టీకా..?
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ChAdOx1 nCoV-19 పేరుతో టీకాను అభివృద్ధి చేసింది. దీనిలో వినియోగించిన అడినో వైరస్ను చింపాజీల నుంచి సేకరించారు. వీటిలో జన్యుపరమైన మార్పులు చేసి సార్స్ కోవ్2లో ఉండే స్పైక్ ప్రొటీన్ వంటిదానిని ఏర్పాటు చేశారు. ఈ వైరస్ శరీరంలోకి వెళ్లాక నకళ్లను సృష్టించి వ్యాపించదు. దీనిని చూసి శరీరం రోగనిరోధక శక్తిని తయారు చేసుకొనేలా ప్రేరేపిస్తుంది.
ఈ టీకాను తీసుకొన్న ఆరు రీసెస్(ఆసియా జాతి) కోతులు వైరస్ను నిలువరించాయి. అమెరికాలోని మాన్టానలోని రాకీమౌంటెన్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రయోగశాలలో దీనిని నిర్వహించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. దీంతో ఈ టీకా నమ్మకమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే మనుషులపై మొదటి దశ టీకా ప్రయోగాలు పూర్తి అయ్యాయి. వీటిలో అవి మనుషలపై చూపించే ప్రభావాన్ని అంచనావేస్తున్నారు.
రెండు, మూడో దశలే కీలకం..
ఈ ప్రయోగాల్లో రెండు, మూడో దశలే కీలకం. ఈ ప్రయోగాల్లో పాల్గొనే వారిలో కొందరికే కరోనావైరస్ కోసం చేసిన ChAdOx1 nCoV-19 టీకా ఇస్తారు. మిగిలిన వారికి MenACWY అనే టీకా ఇస్తారు. ఎవరికి ఏ టీకా ఇచ్చింది తెలియకుండా గోప్యంగా ఉంచుతారు.
MenACWY అంటే ఏమిటీ..?
ఒక రకమైన మెనుంజైటీస్కు కారణమయ్యే ఏ, సీ, డబ్ల్యూ, వై, అనే బాక్టిరియా ఇన్ఫెక్షన్లకు కారణం కాకుండా బ్రిటన్లో వాడే టీకా ఇది. 2015 నుంచి అక్కడ వినియోగిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ టీకా చేయించుకొంటే కొంచెం వాపు, జ్వరం వంటివి వస్తున్నాయి. MenACWY చేయించుకొన్నా అలాంటి లక్షణాలే ఉంటాయి. ఈ ప్రయోగంలో ఎవరికి ఏ టీకా చేశారో తెలియకుండా ఇద్దరిలో ఒకే లక్షణాలు చూపించేలా ఉండేందుకు MenACWYను ఎంపిక చేశారు. అదే సెలైన్ నీరు ఎక్కిస్తే వారిలో ఎటువంటి వాపు, జ్వరం రాదు. అప్పుడు వారికి ఆక్స్ఫర్డ్ టీకా చేయలేదని తేలిపోతుంది.
ఈ ప్రయోగాల్లో ఏమి పరీక్షిస్తారు..?
కొవిడ్-19కు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందో అంచనావేస్తారు. అదే సమయంలో ప్రమాదకరమైన సైడ్ఎఫెక్ట్లు లేవని నిరూపించాలి. మంచి రోగనిరోధక శక్తిని పెంపొందించాలి. వీరు టీకా వేయించుకొన్న ఏడు రోజులపాటు తమ లక్షణాలను నమోదు చేయాలి. వీరిలో కొంత మందిని కొవిడ్ నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపమని చెబుతారు. ఈ నమూనాలు సేకరించిన వారిలో కొవిడ్ లక్షణాలు ఏమైనా కనిపించాయేమో పరీక్షిస్తారు. వారి ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
పరీక్షలు ఎప్పుడు పూర్తవుతాయి..
ఈ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న కొందరిలో కొవిడ్ లక్షణాలు కనబడితే ప్రయోగ ఫలితాలను విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉంటే వెంటనే ఎక్కువ మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు లక్షణాలు కనిపించిన వారు ఆక్స్ఫర్డ్ టీకా తీసుకొన్నారా..? MenACWY టీకా తీసుకొన్నారా విశ్లేషిస్తారు. ఆక్స్ఫర్డ్ టీకా తీసుకొన్న వారిలో సానుకూల ఫలితాలను బట్టి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. అందుకే ఈ ప్రయోగానికి కొవిడ్ బారిన పడే అవకాశం ఉన్న చోట్ల విధులు నిర్వహిస్తున్న వారినే ఎంపిక చేసుకొన్నారు. వీరిలో వైద్య సిబ్బంది, ఇతర కీలక విభాగాల్లో పనిచేసే వారు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి