మహారాష్ట్రలో తగ్గిన మరణాల రేటు

భారత్‌లో కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో గత నెల రోజుల వ్యవధిలో మరణాల రేటు తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఏప్రిల్‌ 22న 4.76 శాతంగా ఉన్న మరణాల రేటు మే 21 నాటికి 3.49 శాతానికి చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.....

Published : 23 May 2020 14:43 IST

ముంబయి: భారత్‌లో కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో గత నెల రోజుల వ్యవధిలో మరణాల రేటు తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఏప్రిల్‌ 22న 4.76 శాతంగా ఉన్న మరణాల రేటు మే 21 నాటికి 3.49 శాతానికి చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఈ వ్యవధిలో మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గత నెల 22న రాష్ట్రంలో 5,649 కేసులు నమోదుకాగా.. వారిలో 269 మంది మృత్యువాతపడ్డారు. ఇక శనివారం నాటికి కేసుల సంఖ్య 44,582కు పెరగ్గా.. మృతుల సంఖ్య 1,517కు చేరింది.

ప్రస్తుత మరణాల రేటు 3.40శాతంగా ఉంది. గత నెల రోజులుగా మరణాల రేటు క్రమంగా పడిపోతూ వస్తుండడం గమనార్హం. అదే సమయంలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు సైతం భారీగా పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్‌ 22 నాటికి 89 వేల పరీక్షలు నిర్వహించగా.. నేటికి అది 3.22 లక్షలకు చేరింది. ఇక రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 86.74 శాతం మంది 60 ఏళ్ల లోపు వారేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు గత ఆరు రోజులుగా రాష్ట్రంలో రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయినా, ఇప్పటి వరకు రాష్ట్రంలో సామూహిక వ్యాప్తి లేదని ప్రభుత్వం చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు