ఇవాంక ట్వీట్పై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం
అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని సైకిల్పై 1200 కిలోమీటర్లు తీసుకొచ్చిన బిహార్ బాలిక జ్యోతికుమారిని(15) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ శనివారం ప్రశంసించిన సంగతి తెలిసిందే...
ఇంటర్నెట్డెస్క్: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని సైకిల్పై 1200 కిలోమీటర్లు తీసుకొచ్చిన బిహార్ బాలిక జ్యోతికుమారిని(15) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ శనివారం ప్రశంసించిన సంగతి తెలిసిందే. ట్విటర్లో ఇవాంక.. జ్యోతిని మెచ్చుకుంటూ ‘ఎంతో ఓర్పుతో అద్భుతమైన, ప్రేమపూర్వక సాహసం’ చేసిందని కొనియాడారు. కాగా, ఈ ట్వీట్కు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పేదరికంతో.. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన జ్యోతి.. 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడాన్ని థ్రిల్ కోసం చేసినట్లుగా అభివర్ణిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం జ్యోతిని ఓడించిందని విమర్శించారు. ఈ విషయాన్ని ఏదో సాధించినట్లుగా చూడటం విడ్డూరమని పేర్కొన్నారు. మరోవైపు జ్యోతి సాహసాన్ని గుర్తించిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. భారత సైక్లింగ్ సమాఖ్య ఆమెకు ట్రయల్స్ నిర్వహించడానికి ముందుకొచ్చింది. అలాగే స్థానిక విద్యాశాఖ.. ఆమె మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఇదీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్