జపాన్లో కరోనా వైరస్ ఎలా తగ్గింది?
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. లాక్డౌన్ విధించడంతోపాటు లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి.
టోక్యో: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. లాక్డౌన్ విధించడంతోపాటు వైరస్ సోకిన వ్యక్తుల్ని గుర్తించేందుకు లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో అధిక వృద్ధ జనాభా కలిగిన జపాన్లో వైరస్ తీవ్రత స్వల్ప కాలంలోనే అదుపులోకి రావడం ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా దేశంలో విధించిన అత్యయికస్థితిని కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జపాన్ ఏవిధంగా వైరస్ను అరికట్టిందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
దాదాపు 13కోట్ల జనాభా కలిగిన జపాన్లో ఇప్పటిదాకా 17,000 పాజిటివ్ కేసులు నమోదుకాగా 825 మంది మృత్యువాతపడ్డారు. ఇక అత్యధిక జనసాంద్రత కలిగిన టోక్యో మహానగరంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పదుల సంఖ్యకు పడిపోయింది. అయితే గత నెలలో కాస్త తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అత్యయికస్థితి ప్రకటించినప్పటికీ పూర్తి లాక్డౌన్ విధించలేదు. దీంతో క్షౌరశాలలు, రెస్టారెంట్లు కూడా తెరిచే ఉంచారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను బయట తిరిగేందుకు కూడా అనుమతించారు. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు కూడా ఆశించినంతగా చేయలేదు. కేవలం దేశజనాభాలో 0.2శాతం ప్రజలకు మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా భౌతిక దూరంపై ఉన్న ఆంక్షలను స్వల్పకాలంలోనే సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. కొవిడ్ మరణాల రేటు కూడా స్వల్పంగానే ఉంది. అయితే, అత్యంత సాంకేతికత, మెరుగైన వైద్య సదుపాయాలున్న దేశాల్లోనూ వైరస్ నియంత్రణలోకి రాకుండా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ సమయంలో జపాన్లో తాజా పరిస్థితులు సామాన్యులతో పాటు నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వైరస్ తీవ్రత తగ్గడానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించనప్పటకీ జపాన్ ప్రజల జీవన విధానంతో పాటు ఎన్నో కారకాలు వారికి తోడ్పడినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సాధారణ సమయాల్లోనూ జపాన్ ప్రజలు ధరించే మాస్క్లు(మాస్క్ కల్చర్), తక్కువ ఊబకాయం కలిగిన ప్రజలు, వైరస్ బయటపడ్డ తొలినాళ్లలోనే పాఠశాలల మూత వంటి చర్యలు వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో దోహదపడ్డట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితోపాటు మిగతా భాషలతో పోలిస్తే జపనీయులు మాట్లాడేటప్పుడు తక్కువ నోటి తుంపరులు బయటకు వస్తాయని..ఇది కూడా వైరస్ వ్యాప్తి నిరోధకంగా పనిచేసి ఉండవచ్చని అక్కడి నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాంటాక్ట్ ట్రేసింగ్..
జనవరిలో తొలికేసు నమోదైనప్పుడే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమయంలో వైరస్సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసర్లను సద్వినియోగపరుచుకుంది. ఇన్ఫ్లూయెంజా, క్షయ వంటి వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం 2018లో దాదాపు 50వేల మంది వైద్యసిబ్బందిని నియమించుకుంది. వీరిలో దాదాపు సగం మంది శిక్షణ పొందిన నర్సులు ఉన్నారు. వీరందరినీ కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్కోసం ఉపయోగించుకొని వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగింది. జపాన్లో ప్రత్యేకంగా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) లేనప్పటికీ దేశంలో ఉన్న మెరుగైన ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ సహాయంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లు అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డైమండ్ ప్రిన్సెస్..
చైనా వెలుపల కరోనా వైరస్ వ్యాపిస్తోన్న సమయంలో జపాన్ సమీపంలో ఆగిన డైమండ్ ప్రిన్సెస్ నౌక అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వారిలో ఒక్కొకరికి వైరస్ బయటపడుతుండడంతో జపాన్ అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని రోజుల పాటు అది అంతర్జాతీయంగా వార్తల్లో నిలవడంతో అక్కడి ప్రజల్లో కూడా వైరస్ తీవ్రతపై అవగాహన కలిగించిందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
3సీ విధానం..
భౌతిక దూరాన్ని పాటించడంలో జపాన్ ప్రత్యేక విధానాన్ని అనుసరించింది. పూర్తిగా ఒకరికొకరు దూరంగా ఉండకుండా క్లోజ్డ్ స్పేసెస్, క్రౌడెడ్ స్పేసెస్, క్లోజ్ కాంటాక్ట్ లకు మాత్రమే దూరంగా ఉండాలని సూచించింది. ఇవి కూడా భౌతిక దూరంలాగే మెరుగైన ఫలితాలు ఇచ్చాయని అభిప్రాయపడుతున్నారు.
భిన్న వైరస్..
కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉండడానికి జపనీయులు వారి ఆరోగ్యంపై చూపించే శ్రద్ధ కూడా ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇతర దేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్ జాతితో పోలిస్తే జపాన్లో ఉన్న వైరస్ భిన్నంగా ఉండొచ్చనే వాదన కూడా మొదలైంది. అయితే దీనిపై విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అదృష్టమో లేక ప్రభుత్వ ముందస్తు చర్యలతోనో జపాన్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ..మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రెండవ దఫా విజృంభణ ప్రారంభమైతే మాత్రం అత్యధిక వృద్ధ జనాభా కలిగిన జపాన్ చాలా నష్టపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు