91 లక్షల మందిని తరలించాం: కేంద్రం
కరోనాతో విధించిన లాక్డౌన్తో దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన వలస జీవుల కష్టాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం........
వలస కూలీల కష్టాలపై సుప్రీంకోర్టులో విచారణ
దిల్లీ: కరోనాతో విధించిన లాక్డౌన్తో దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన వలస జీవుల కష్టాలపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం తీసుకున్న చర్యలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. మే 1 నుంచి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా దాదాపు 91 లక్షల మంది వలస కూలీలను రైళ్లు, రోడ్డు మార్గంలో తరలించినట్టు చెప్పారు. తరలించిన వారిలో 80శాతం మందికి పైగా కూలీలు యూపీ, బిహార్లకే వెళ్లారన్నారు. మే 1 నుంచి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వలస కూలీలకు ఆహారం, ఆశ్రయం, రవాణా వసతులతో పాటు ఫండింగ్ తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేం చేశాయనే దానిపై త్రిసభ్య ధర్మాసనం సొలిసిటర్ జనరల్ను దాదాపు 50 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.
రిజిస్ట్రేషన్ చేయించుకున్నా నిరీక్షణ ఎందుకు?
‘‘వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడం, వారికి ఆహారం సమకూర్చడంలో చాలా పెద్ద సమస్య ఉత్పన్నమైంది. అనేకమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కొన్ని వారాల పాటు వారెందుకు ప్రయాణానికి నిరీక్షించాల్సి వచ్చింది? తమ కోసం డబ్బులేమైనా ఖర్చు పెట్టాలని అడుగుతున్నారా? రాష్ట్రాలు ఎలా చెల్లిస్తున్నాయి?’’ అని సొలిసిటర్ జనరల్ను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే, ఒకే సమయంలో అందరినీ స్వస్థలాలకు చేర్చలేకపోయినా.. వాళ్లు రైళ్లలో తమ ఇళ్లకు చేరే వరకు ఆహారం, ఆశ్రయం తప్పకుండా కల్పించాలి కదా అని వ్యాఖ్యానించింది.
దీనిపై తుషార్ మెహతా స్పందిస్తూ.. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా ఇప్పటివరకు దాదాపు 91లక్షల మందిని ఆయా రాష్ట్రాలకు తరలించామని బదులిచ్చారు. అలాగే, గత కొన్ని రోజుల నుంచి రైల్వేశాఖ 84లక్షల భోజనాలను సమకూర్చిందని వివరించారు. చిట్టచివరి వలస కూలీని సైతం స్వస్థలాలకు చేర్చే వరకూ శ్రామిక్ ప్రత్యేక రైళ్లు సేవలను కేంద్రం కొనసాగిస్తుందని కోర్టుకు తెలిపారు.
ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వలస జీవుల కష్టాలపై సుప్రీంకోర్టు మంగళవారం సుమోటోగా స్పందించింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత తీసుకుని వీరికి ఉచితంగా తగిన రవాణా, ఆహారం, వసతి సదుపాయాలను వెంటనే కల్పించాలని ఆదేశించింది. కూలీల దయనీయ పరిస్థితులపై పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వెలువడిన కథనాలను కోర్టు తనకు తానుగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం విచారణ జరిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కూలీలకు ఉపశమనం కల్పించేలా ప్రభుత్వాలు కొన్ని చర్యల్ని చేపట్టినా వాటిలో లోటుపాట్లు ఉన్నాయని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు