మరో పెనువివాదంలో చైనా..!
హాంకాంగ్ స్వయంపాలిత ప్రాంతం హక్కులను కాలరాచేలా కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. హాంకాంగ్లో జాతీయ భధ్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనాలోని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ దాదాపు ఏకగ్రీవగా ఆమోదముద్ర వేసింది. దీంతో హాంకాంగ్లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేయడానికి చైనాకు అధికారం దక్కుతుంది. వేర్పాటు వాదం అణిచివేత,
సినో-బ్రిటిష్ ఒప్పందానికి తూట్లు
బీజింగ్: హాంకాంగ్ స్వయంపాలిత ప్రాంతం హక్కులను కాలరాచేలా కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. హాంకాంగ్లో జాతీయ భధ్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనాలోని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో హాంకాంగ్లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేయడానికి చైనాకు అధికారం దక్కుతుంది. వేర్పాటు వాదం అణిచివేత, హాంకాంగ్ హక్కుల అణచివేత, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధం పేరుతో హింసకు పాల్పడం, విదేశీ జోక్యాన్ని నివారించడంతోపాటు చైనాలోని సెక్యూరిటీ ఏజెన్సీలు హాంకాంగ్లోకి వెళ్లడానికి అధికారం లభిస్తుంది. ఈ బిల్లుకు కేవలం ఒక ఓటు మాత్రమే వ్యతిరేకంగా వచ్చింది. 2,878 మంది అనుకూలంగా ఓటు వేయగా.. ఆరుగురు గైర్హాజరయ్యారు.
ఈ చట్టానికి అవసరమైన విధివిధానాలను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తయారు చేస్తుంది. దీనికి మరో రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత హాంకాంగ్ ప్రభుత్వం శాసన ప్రకటనతో దీనిని అమల్లోకి తెస్తుంది. అక్కడి చట్టసభను తప్పించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నారు. అంటే దొడ్డిదోవలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం అన్నమాట. 1997 బ్రిటన్ పాలకుల నుంచి హాంకాంగ్ను తీసుకొనే సమయంలో చేసుకొన్న వన్ కంట్రీ, టూ సిస్టమ్స్ ఒప్పందానికి ఇది విరుద్ధం.
హాంకాంగ్ కోసం ఆత్రం..!
అసలు హాంకాంగ్ కోసం చైనా అంతగా ఎందుకు వెంపర్లాడుతోంది? ఒప్పందం ప్రకారం 2047 వరకు కూడా హాంకాంగ్లో ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వకూడదని ఎందుకు అనుకుంటోంది? ఇప్పటి నుంచే ఈ నగరాన్ని చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడానికి ఎందుకు ఆత్రపడుతోంది..? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఆర్థిక అవసరాలు..! హాంకాంగ్ చైనాకు బంగారు బాతు.. ఆ బాతు గుడ్లను వాడుకోకుండా.. బాతునే కోసుకు తినాలని చూస్తోంది.
2019 జూన్ 9న వివాదానికి బీజం వేస్తూ హాంకాంగ్ ప్రభుత్వం నేరస్థులను చైనాకు తరలించే బిల్లును ప్రవేశపెట్టింది. మూడు రోజుల తర్వాత ఆందోళనలు మొదలయ్యాయి. అవి సునామీలా మారాయి. సాక్షాత్తు హాంకాంగ్ పాలకురాలు, చైనా కీలుబొమ్మగా పేరున్న కెరీలామ్ ‘సారీ’ చెప్పినా.. ఏడ్చినా.. బిల్లును రద్దు చేసినా ఆందోళనలు 2019 చివరి వరకు కొనసాగాయి. ఒక దశలో చైనా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. భద్రతా దళాలు మారుదుస్తుల్లో హాంకాంగ్ ప్రదర్శనకారుల్లో చేరి దాడులు చేశాయి. హాంకాంగ్ సరిహద్దుల్లో భారీగా చైనా దళాలు, ట్యాంకులను మోహరించింది. అప్పట్లో వ్యవహారం మొత్తం చూస్తే హాంకాంగ్పై చైనా దండయాత్ర చేస్తోందా.. లేక మరో తియాన్మన్ స్క్వేర్ పునరావృతం అవుతుందా అనే స్థాయిలో పరిస్థితి నెలకొంది. కానీ, 2020 ప్రారంభంలో చైనా, హాంకాంగ్ల్లో కరోనావైరస్ వ్యాపించింది. దీంతో ఉద్యమానికి కొన్నాళ్లు విరామం లభించింది. ఈ అదునుగా చైనా జాతీయ భద్రతా చట్టాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. కానీ, వందల సంఖ్యలో విద్యార్థులు, రాజకీయ నాయకులను అరెస్టు చేశారు.
ఆ నగరం ఓ ఆర్థిక సౌధం
ఒకప్పటి బ్రిటిష్ కాలనీ అయిన హాంకాంగ్ ఆర్థికంగా ఎప్పుడూ సుసంపన్నంగానే ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపార వాతావరణం హాంకాంగ్కు పశ్చిమ దేశాల నుంచి పెట్టుబడుల వరదను పారించింది. చైనా కంపెనీలకు విదేశీ నిధులు ఇక్కడి నుంచే వెళతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్లలో హాంకాంగ్ మార్కెట్ ఒకటి. హాంకాంగ్ ఆదాయం, పరపతి నుంచి చైనా భారీగా లబ్ధిపొందింది.
చైనా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద దేశేతర మార్కెట్ హాంకాంగే. ప్రపంచ దేశాలకే అప్పులు ఇచ్చే ఆ బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో 7శాతం ఈ ఒక్క నగరంలోనే ఉన్నాయంటే ఎంత వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ చైనాకు చెందిన బీవోసీ హాంకాంగ్ లిమిటెడ్ నోట్లు జారీ చేసే బ్యాంకుల్లో ఒకటి. ఈ బ్యాంకు నిర్వహణ ఆదాయం ఐదో వంతు హాంకాంగ్, మకావ్ల నుంచే వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో కొన్నిటి ప్రధాన కార్యాలయాలు హాంకాంగ్లోనే ఉన్నాయి.
చైనాకు అవసరానికి సొమ్ము..
చైనాలో నగదు కొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, స్థానిక ప్రభుత్వ ఆర్థిక సంస్థలు హాంకాంగ్ నుంచి రుణాలు తెచ్చుకొంటాయి. అవే రుణాలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిందే. ఇప్పుడు హాంకాంగ్ చేజారితే చైనాకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు.
డ్రాగన్ కంపెనీలకు ఆశ్రయం..
పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలు ఉన్న హాంకాంగ్లో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి చైనా కంపెనీలు ఇష్టపడతాయి. చాలా కంపెనీలు ఇక్కడి స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. టెన్సెంట్ హోల్డింగ్స్, క్నుక్ వంటి దిగ్గజాలు ఇక్కడే ఉన్నాయి. 2015 నుంచి హాంకాంగ్లో ఐపీవోలకు వచ్చిన చైనా కంపెనీలు 100 బిలియన్ డాలర్లకు పైగా సేకరించాయి. చైనాలో సేకరించిన మొత్తంలో ఇది 80శాతానికి సమానం..! అదీ హాంకాంగ్ స్టాక్ మార్కెట్ శక్తి.
తాజాగా విదేశీ పెట్టుబడిదారులు హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ద్వారా షాంఘై మార్కెట్లో ట్రేడింగ్ చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఈ రకమైన ట్రేడింగ్ వాటా షాంఘై స్టాక్మార్కెట్లో 8శాతానికి చేరుకొంది.
డాలర్ మార్పిడీకి అడ్డా..
హాంకాంగ్ కరెన్సీ విలువ డాలర్కు దాదాపు సమానంగా ఉంటుంది. దీంతో చైనీయులు యువాన్లను డాలర్లలో మార్చుకోవడానికి హాంకాంగ్లోని బీమా ఉత్పత్తులను వాడుకొంటారు. క్రెడిట్ కార్డ్ల ద్వారా చెల్లింపులు చేసి చైనా నిబంధనలను బైపాస్ చేస్తుంటారు. దీనికి తోడు చైనా విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా హాంకాంగ్కే వెళతాయి. 2017 చివరినాటికి ఇవి దాదాపు 981 బిలియన్ డాలర్లను చేరుకున్నాయి.
అల్లర్ల అదపు డ్రాగన్కు అత్యవసరం..
హాంకాంగ్లో ఏమి చేసైనా అల్లర్లను అదుపు చేయడం చైనాకు ఇప్పుడు అత్యవసరం. అమెరికా హాంకాంగ్ను వాణిజ్య యుద్ధంలో బేరాలాడటానికి ఆయుధంగా మలుచుకొంది. హాంకాంగ్ రక్షణకు అమెరికా ఏకంగా ఒక ఆంక్షల బిల్లును కూడా తాజాగా సిద్ధం చేస్తోంది. మరోపక్క మైక్ పాంపియో కూడా ఇక హాంకాంగ్ను స్టేట్ డిపార్ట్మెంట్ ఏమాత్రం స్వతంత్ర ప్రాంతం చూడదని పేర్కొన్నారు.
* హాంకాంగ్ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులకు టారీఫ్లు విధించకుండా ట్రంప్ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. చాలా చైనా కంపెనీలు ఇప్పుడు హాంకాంగ్ నుంచే ఎగుమతులు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆందోళనలు ఆ ఎగమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ మినహాయింపులు ఇక దక్కకపోవచ్చు.
* చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో షాంఘై, షెన్జన్ వంటి నగరాలను పశ్చిమ దేశ కంపెనీలను ఆకర్షించేలా చేయాలని భావిస్తోంది. కానీ, ఇది రాత్రికి రాత్రే జరగదు. అప్పటి వరకు ఆర్థిక సంక్షోభం ఆగదు. అందుకే బంగారు బాతు వంటి హాంకాంగ్ను దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి