వలస కూలీల అంశంపై సుప్రీం కీలక ఆదేశాలు
లాక్డౌన్ వేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వలస కూలీలప్రయాణానికి సంబంధించి ఎలాంటి రవాణా ఛార్జీలూ వసూలు చేయకూడదని......
వారి నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేయొద్దు
ఉచిత భోజన సదుపాయం కల్పించాలి
తదుపరి విచారణ జూన్ 5కు వాయిదా
దిల్లీ: లాక్డౌన్ వేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వలస కూలీలప్రయాణానికి సంబంధించి ఎలాంటి రవాణా ఛార్జీలూ వసూలు చేయకూడదని పేర్కొంది. వారిని గుర్తించి, సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య దర్మాసనం కేసును సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. వలస కూలీల అంశంపై ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రాథమిక నివేదికను కోర్టుకు సమర్పించారు. అన్ని రాష్ట్రాలు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
వలస కూలీల అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక లోపాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం పేర్కొంది. రవాణా కోసం రిజిస్ట్రేషన్, భోజన సదుపాయం, రైళ్ల కోసం ఎదురు చూపులు చూడడం వంటి సమస్యలు గుర్తించామంది. వారి కష్టాలు చూసి కొన్ని మధ్యంతర ఆదేశాలు ఇస్తున్నామని తెలిపింది. వలస కూలీల నుంచి బస్సు, రైలు ప్రయాణానికి ఎలాంటి ఖర్చులూ వసూలు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారిని గుర్తించడం, వారికి సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టంచేసింది.
రైలు ఎక్కే వరకు అక్కడి రాష్ట్రం, ఎక్కిన తర్వాత రైల్వే శాఖ, చేరుకున్న తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలకు భోజన సదుపాయం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వలస కూలీల నమోదు చర్యను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సహాయ కేంద్రాల ద్వారా త్వరగా స్వస్థలాలకు వెళ్లే రవాణా సదుపాయం కల్పించాలంది. ఈ విషయాలు వలస కూలీలకు చేరేలా ప్రచారం చేయాలని సూచించింది. నడిచి వెళ్తున్న కూలీలు కనిపిస్తే వెంటనే వారిని శిబిరాలకు తరలించి సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ల ఏర్పాటు కోసం వినతి పెడితే రైల్వే శాఖ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎంత మంది కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు? వారి రవాణా ప్రణాళిక, రిజిస్ట్రేషన్ విధానాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.
వీళ్లేం చేశారు.. పోస్టులు పెట్టడం తప్ప: ఎస్జీ
వలస కూలీల తరలింపులో కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ వాటిని పదే పదే చూపిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, సగటున రోజుకు 187 రైళ్ల ద్వారా 50 లక్షల మందిని, రోడ్డు మార్గంలో మరో 47 లక్షల మందిని తరలించామని చెప్పారు. రవాణా ఖర్చుల విషయంలో రైల్వే ఛార్జీలను రాష్ట్రాలు భరించాయని, కొన్ని సందర్భాల్లో రీయింబర్స్ చేసినట్లు తెలిపారు. రైళ్లలో ఉచితంగా భోజనం అందించామని చెప్పారు. స్క్రీనింగ్ నిర్వహించి క్వారంటైన్కు, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించామని తెలిపారు. మొత్తం వలస కార్మికుల తరలింపునకు ఎంత సమయం పడుతుందని ఎస్జీని ధర్మాసనం ప్రశ్నించగా.. రాష్ట్రాలు నివేదిక సమర్పించాక అవగాహన వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం కోరిన వారిపై ఎస్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్మీడియాలో పోస్టులు, ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప వీళ్లేం చేశారని, రాజకీయాలకు కోర్టులను వేదిక చేసుకోవడం తగదన్నారు. ఏ ఉద్దేశంతో ఆశ్రయించినా కోర్టు మాత్రం విచక్షణ మేరకే నడుచుకుంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?