కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన భాజపా నేత

భారతీయ జనతా పార్టీ (భాజపా) జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆస్పత్రిలో చేరారు. గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో....

Published : 28 May 2020 23:39 IST

దిల్లీ: భారతీయ జనతా పార్టీ (భాజపా) జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆస్పత్రిలో చేరారు. గురుగ్రామ్‌లోని ఆస్పత్రిలో గురువారం ఆయనను చేర్పించారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆ పార్టీ నేతలు అమిత్‌ మాలవీయ, జ్యోతిరాధిత్య సింథియా తదితరులు ట్వీట్లు చేశారు.

భాజపా ముఖ్యుల్లో సంబిత్‌ పాత్రా ఒకరు. టీవీ ఛానెళ్లలో ఆ పార్టీ తరఫున ఎక్కువగా కనిపిస్తుంటారు. సోషల్‌మీడియాలో సైతం పలు అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. గురువారం సైతం కొన్ని ట్వీట్లు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని