పుల్వామా కారు బాంబుతో ప్రమాద ఘంటికలు..!
పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు తీసిన బాంబుదాడి ఘటన జరిగి ఏడాది దాటగానే అటువంటి దాడికే మరోమారు ఉగ్రవాదులు ప్రణాళిక రచించడం ఆందోళనకలిగించే అంశంగా మారింది. చివరి నిమిషంలో భద్రతా దళాలు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలు తీసిన బాంబుదాడి ఘటన జరిగి ఏడాది దాటగానే అటువంటి దాడికే మరోమారు ఉగ్రవాదులు ప్రణాళిక రచించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. చివరి నిమిషంలో భద్రతా దళాలు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై ఇప్పటికే భారత్-పాక్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కానీ, మారుతున్న పరిస్థితులు భద్రతా దళాలకు మరిన్ని సవాళ్లను విసురుతున్నాయి. ఇటువంటి శైలి దాడులు ఇరాక్, సిరియా వంటి చోట్ల జరుగుతుంటాయి. వీటిని కనుగొనడం, ఆపటం చాలా శ్రమతో కూడుకొన్న పని.
చివరి నిమిషంలో ఉప్పందండంతో..
పుల్వామా ప్రాంతంలో భారీ బాంబుతో ఓ కారు సంచరిస్తోందని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బుధవారం రాత్రి నుంచే రాష్ట్రీయ రైఫిల్స్, 182, 183 బెటాలియన్లకు చెందిన సీఆర్పీఎఫ్కు బలగాలు, కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూపులు సంయుక్తంగా పలు చోట్ల నిఘా వేశాయి. అర్ధరాత్రి దాటాక హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందినట్లు భావిస్తున్న ఆదిల్ అనే ఉగ్రవాది తెల్లటి సాంత్రో కారులో రాజ్పోరాలోని ‘అయినాగుండ్’ ప్రాంతానికి వచ్చాడు. కారులో 45 కేజీల అమ్మోనియం నైట్రేట్, నైట్రోగ్లిజరిన్ కలిపి తయారు చేసిన బాంబు ఉంది. అప్పటికి సమయం తెల్లవారుజామున 2.30 గంటలైంది. అక్కడ బలగాల కదలికలను గమనించిన కారును వదిలి ఉగ్రవాది అడవుల్లోకి పరారయ్యాడు.
సమీపంలోని బలగాల క్యాంపులు..!
కారు స్వాధీనం చేసుకొన్న ప్రదేశానికి 3 నుంచి 5 కిలోమీటర్ల లోపలే సీఆర్పీఎఫ్ 183 బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపులు ఉన్నాయి. ఈ కారును బలగాల క్యాంపులపై దాడికి వినియోగించేందుకు తీసుకెళుతున్నట్లు భావిస్తున్నారు. ఒక సారి కారులో బాంబు అమర్చాక దానిని నిర్వీర్యం చేయడం దాదాపు అసాధ్యం. అందుకే బలగాలు ఆ వాహనాన్ని పేల్చేశాయి.
ఉగ్రవాదుల మధ్య సమన్వయం..
ఈ దాడి ప్రణాళిక జైషే మహమ్మద్, లష్కరే తోయిబ, హిజ్బుల్ హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఉగ్ర సంస్థలు పరస్పరం సహకరించుకొంటూ దాడులు నిర్వహిస్తున్నాయని జమ్మూకశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వనరులు, కార్యకర్తలను పరస్పరం వినియోగించుకొంటున్నాయన్నారు. ముఖ్యంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ ఇటువంటి దాడులను నిర్వహించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. 2019 మార్చి 30వ తేదీన బనిహాల్ వద్ద హిజ్బుల్ కారు బాంబు దాడికి విఫలయత్నం చేసింది. ఆ తర్వాత పట్టుబడ్డ ఐదుగురు ఉగ్రవాదులు హిజ్బుల్ కారు బాంబుదాడుల విషయాన్ని వెల్లడించారు.
ఆన్లైన్లో కెమికల్స్ కొని..
2019లో పుల్వామ దాడి తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను కొనుగోలు చేసే మార్గాలపై భద్రతా బలగాలు దృష్టిపెట్టాయి. అప్పట్లో అరెస్టైన వారిని విచారించగా.. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను ఒక ప్రముఖ ఆన్లైన్ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు కారుబాంబులు తయారు చేయడానికి చాలా సాంకేతికత అవసరం. గతంలో పాక్ నుంచి వచ్చిన ఉమర్ అనే ఉగ్రవాది సీఆర్పీఎఫ్పై దాడికి అవసరమైన కారు బాంబును చేసినట్లు బలగాలు కనుగొన్నాయి. ఉగ్రవాదులు తమ కదలికలను నిగూఢంగా ఉంచడానికి వర్చువల్ సిమ్కార్డులను కూడా వినియోగిస్తున్నారు. గతంలో పుల్వామా దాడికి వీటిని వాడారు. ముంబయి దాడుల సమయంలోనూ ఉగ్రవాదులు ఇటువంటి సిమ్లతో తమ బాస్లకు సమాచారం అందించారు. ఈ సిమ్ సర్వీస్ ప్రొవైడర్లు అమెరికాలో ఉంటారు. కంప్యూటర్లో ఒక టెలిఫోన్ నెంబర్ను సృష్టిస్తారు. దీనిని వాడటం కోసం సదరు సర్వీసు ప్రొవైడర్ అప్లికేషన్ను మన స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. సోషల్ మీడియా ఖాతాలతో అనుసంధానిస్తే ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దానిని ఆ యాప్కు ఇస్తే వర్చువల్ సిమ్ యాక్టివ్ అవుతుంది. దీని నెంబర్లు ‘+1’ రూపంలో వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. -
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM