‘గ్లోబల్ లీడర్’ కల సాకారం దిశగా..
భారత్ను ‘గ్లోబల్ లీడర్’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా తమ తొలి ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంవత్సర కాలంలో తన ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు.....
ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మోదీ బహిరంగ లేఖ
దిల్లీ: భారత్ను ‘గ్లోబల్ లీడర్’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా తమ తొలి ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంవత్సర కాలంలో తన ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు, సాధించిన విజయాలను గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కి నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ రాశారు.
ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం..
అధికరణ 370 రద్దు ప్రజల్లో ఏకత్వాన్ని, దేశ సమగ్రతను చాటిందని మోదీ తెలిపారు. శతాబ్దాలుగా పరిష్కారం దొరకని అయోధ్య రామమందిర వివాదం తన పాలనాకాలంలోనే సుప్రీంకోర్టు తీర్పుతో సద్దుమణగడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం మహిళల గౌరవ ప్రతిష్ఠలను కాపాడుతూ.. ముమ్మారు తలాక్ సంప్రదాయాన్ని చెత్తబుట్టలో వేశామని చెప్పుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశ దయాగుణాన్ని, సమ్మిళిత తత్వాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. త్రిదళాధిపతి నియామకం సైన్యంలో సమన్వయాన్ని పెంపొందించిందన్నారు.
రైతులు, మహిళలు, యువత సాధికారిత కోసం..
పేద, రైతు, మహిళ, యువత ఇలా అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మోదీ లేఖలో వివరించారు. రైతులకు పెట్టుబడి సాయమందించే ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ఇప్పుడు అందరు రైతులకు వర్తింపజేశామని తెలిపారు. ఈ పథకం కింద ఒక్క సంవత్సరం కాలంలోనే రూ.72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని గుర్తుచేశారు. జల్జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 15 కోట్ల కుటుంబాలకు తాగునీరందించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి వ్యవసాయ కూలీలు, చిరువ్యాపారులు, అసంఘటిత రంగంలోని వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3000 పింఛను ఇచ్చేందుకు సిద్ధమయ్యామన్నారు. రోదసీయాత్రకు సంబంధించిన ‘గగన్యాన్’ ప్రాజెక్టు దిశగా చర్యల్ని వేగవంతం చేసినట్లు మోదీ లేఖలో వివరించారు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గింపు..
వ్యాపారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ‘వ్యాపారి కల్యాణ్ బోర్డు’ నెలకొల్పామని మోదీ గుర్తుచేశారు. స్వయం సహాయక సంఘాల్లో నమోదైన ఏడు కోట్ల మంది మహిళలకు రుణ సదుపాయం కల్పించామని తెలిపారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇటీవల ఒక్కో గ్రూపునకు రూ.20 లక్షల వరకు రుణాలిచ్చామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లల కోసం 400 ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ను ప్రారంభించామని తెలిపారు. ఇలా పలు కార్యక్రమాల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలు తగ్గిపోతున్నాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి