అంతరిక్షయానంలో సరికొత్త అధ్యాయం!
అంతరిక్షయానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొట్టమొదటిసారి ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన అంతరిక్షనౌకలో వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3:22 గంటలకు మానవ సహిత ‘క్రూ డ్రాగన్’ క్యాప్సూల్ను......
ఓ ప్రైవేటు వ్యోమనౌకలో మానవుల తొలి రోదసీయానం
వాషింగ్టన్: అంతరిక్షయానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొట్టమొదటిసారి ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన అంతరిక్షనౌకలో వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3:22 గంటలకు మానవ సహిత ‘క్రూ డ్రాగన్’ క్యాప్సూల్ను మోసుకెళ్లిన ఫాల్కన్-9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ తన చరిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత అందులోని వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి చేరుకోనున్నారు.
వెళ్లింది వీరే..
అనేక చారిత్రక అంతరిక్షయానాలకు వేదికైన ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటరే మరో సరికొత్త చరిత్రకూ వేదికగా నిలిచింది. నాసాకు చెందిన బాబ్ బెహెంకెన్, డో హార్లీ అనే వ్యోమగాములను మోసుకెళ్తూ స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఒక ప్రైవేటు సంస్థ వ్యోమగాములను కక్ష్యలోకి పంపించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అక్కడే ఉన్న ఎక్స్పీడిషన్ 63 సభ్యులతో కలిసి వీరు నాలుగు నెలల పాటు పనిచేయనున్నారు. ఇంజిన్ను మండించడానికి ముందు ‘లెట్స్ లైట్ దిస్ క్యాండిల్’ అనే చారిత్రక పదాల్ని హార్లీ అనడం విశేషం. 1961లో అమెరికా తొలి మానవసహిత ప్రయోగ సమయంలో నాటి వ్యోమగామి అలెన్ షెపర్డ్ అన్న ఈ మాటల్నే తాజాగా హార్లీ వల్లెవేశారు.
అమెరికా కల సాకారమైంది..
ఈ ప్రయోగంతో దాదాపు దశాబ్ద కాలంగా వేచిచూస్తున్న అమెరికా కల సైతం సాకారమైంది. 2011లో చివరిసారి అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లారు. ఆ ప్రయోగంతో అమెరికా వ్యోమనౌక రిటైర్ కావడంతో నాటి నుంచి రష్యాకు చెందిన సూయజ్ అంతరిక్ష నౌకలోనే ఐఎస్ఎస్కు వెళ్తున్నారు. దీనికోసం రష్యాకు అమెరికా భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. చంద్రుడు, అంగారక గ్రహంపైకి వెళ్లే ప్రాజెక్టుల్లో నాసా తలమునకలై ఉంది. దీంతో ఐఎస్ఎస్ సహా ఇతర రోదసీయానాలకు అవసమయ్యే వ్యోమనౌకల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇందుకు ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్, మరో ప్రముఖ సంస్థ బోయింగ్ ముందుకు వచ్చాయి. తాజాగా స్పేస్ఎక్స్ తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పలుసార్లు స్పేస్ఎక్స్ నిర్మించిన డ్రాగన్ ఐఎస్ఎస్కు సరకులను మోసుకెళ్లిన అనుభవం ఉండడం గమనార్హం.
స్పేస్ఎక్స్కూ ఎంతో ప్రతిష్ఠాత్మకం..
భవిష్యత్తులో అంగారక గ్రహంపై జనావాసాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్న స్పేస్ఎక్స్ ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించింది. మనుషుల్ని మోసుకెళ్లడంలో తమ సామర్థ్యం నిరూపించేందుకు అవకాశంగా వినియోగించుకుంది. అలాగే, ‘స్పేస్ఎక్స్ డెమో-2’గా పేర్కొన్న ఈ మిషన్ విజయవంతం కావడంతో నాసాతో చేసుకున్న 2.6 బిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకారం ఐఎస్ఎస్కు పంపే తమ ఆరు ఆపరేషనల్ మిషన్లను కొనసాగించేందుకు స్పేస్ఎక్స్కు మార్గం సుగమం కానుంది
స్పేస్ఎక్స్ లక్ష్యం నెరవేరిన వేళ.. మస్క్
ఈ ప్రయోగంతో స్పేస్ఎక్స్ కల సాకారమైందంటూ ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంలో స్పేస్ఎక్స్, నాసా సహా ఇతర భాగస్వాముల కృషి ఎంతో ఉందని తెలిపారు. చాలా కాలం తర్వాత అమెరికా గడ్డపై నుంచి అమెరికా వ్యోమగాముల్ని రోదసీలోకి పంపడం ఆనందంగా ఉందని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ అభిప్రాయపడ్డారు.
సంక్షోభంలో ఊరట..
వాస్తవానికి ఈ ప్రయోగం గత వారమే జరగాల్సి ఉంది. కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికాకు ఈ ప్రయోగం కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వైట్ హౌజ్ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్మస్క్ను ఈ సందర్భంగా ట్రంప్ ప్రశంసించారు. ప్రయోగానికి ముందు వ్యోమగాములతో తాను మాట్లాడినట్లు అధ్యక్షుడు వెల్లడించారు.
ఇదీ చదవండి..
మరోసారి పేలిన స్పేస్ఎక్స్ రాకెట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల