నిరసనలే అమెరికా బలం: బుష్
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనల పట్ల ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న విషాద వైఫల్యాలను సమీక్షించి సమన్యాయం కోసం సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.........
వాటిని అణచివేయాలనుకునే వారికి అమెరికా అర్థమే తెలియదని వ్యాఖ్య
హ్యూస్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనల పట్ల ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న విషాద వైఫల్యాలను సమీక్షించి సమన్యాయం కోసం సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. నిరసనలే తమ దేశ బలమని.. వాటిని అణచివేయాలనుకుంటున్నవారికి అమెరికా అంటే అర్థం తెలియదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా రిపబ్లికన్ పార్టీ సహచరుడు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆయన చురకలంటించారు. ఈ మేరకు బుష్ మంగళవారం ట్విటర్ వేదికగా ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేశారు.
సొంతదేశంలోనే ఆఫ్రికన్-అమెరికన్లపై దాడులు జరగడం అక్కడి వ్యవస్థల వైఫల్యమని బుష్ వ్యాఖ్యానించారు. వివిధ నేపథ్యాలున్న అమెరికా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం దేశం సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్య అని గుర్తుచేశారు. అమెరికా ఆదర్శాలను అవగాహన చేసుకోవడమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం అని అభిప్రాయపడ్డారు.
అయితే, శాంతియుత నిరసనల ద్వారానే న్యాయం జరుగుతుందని బుష్ హితవు పలికారు. దోపిడీల వల్ల స్వేచ్ఛ, విధ్వంసం వల్ల ప్రగతి సాధ్యం కావని తాజా హింసాత్మక ఆందోళనలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2009లో పదవి నుంచి దిగిపోయిన తర్వాత బుష్ సమకాలీన అంశాలపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.
బుష్ ప్రకటన వెలువడిన కాసేపటికే ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. అబ్రహం లింకన్ తర్వాత నల్లజాతీయుల సంక్షేమం కోసం తాను తీసుకున్న చర్యలు ఏ అధ్యక్షుడూ తీసుకోలేదని వ్యాఖ్యానించారు. తన హయాంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఏకరువు పెట్టారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.