భారత్లో కరోనా: 24గంటల్లో 9304 కేసులు
భారత్లో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గత కొన్నిరోజులుగా దేశంలో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 9304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనా వైరస్ బయటపడిన అనంతరం 24గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
దేశంలో 6వేలు దాటిన కరోనా మరణాలు..
దిల్లీ: భారత్లో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గత కొన్నిరోజులుగా దేశంలో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 9304పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత 24గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో గురువారం ఉదయానికి దేశంలో కొవిడ్-19 బారినపడ్డ వారిసంఖ్య 2,16,919కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా దేశంలో ప్రతిరోజు 200పైగా మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 260మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణించడం కూడా ఇదే తొలిసారి. దేశంలో ఇప్పటివరకు కొవిడ్ సోకి 6075మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కరోనా మరణాల్లో ప్రపంచంలో ఇప్పటివరకు 13స్థానంలో కొనసాగిన భారత్, తాజాగా 12స్థానానికి ఎగబాకింది. ఇక మనదేశంలో కొవిడ్ సోకిన వారిలో ఇప్పటివరకు 1,04,107 మంది కోలుకోగా మరో 1,06,737 మంది చికిత్స పొందుతున్నారు.
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు వెయ్యి మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా కేసులు గత 15రోజుల్లోనే రెట్టింపు కాగా.. మరణాలు కూడా 17రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. మే 18న 3029 మరణాలు ఉండగా..జూన్ 4వ తేదీనాటికి 6075కి చేరింది. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 12స్థానానికి చేరింది. ప్రస్తుతం కెనడా 7400 మరణాలతో 11స్థానంలో ఉండగా.. 5900 మరణాలతో నెదర్లాండ్ 13స్థానంలో కొనసాగుతోంది. కొవిడ్-19 కేసులు అధికంగా ఉన్న దేశాల్లో మాత్రం భారత్ 7 స్థానంలో ఉంది. దాదాపు 2లక్షల 33వేల కేసులతో ఇటలీ ఆరవ స్థానంలో ఉండగా..లక్షా 84వేల కేసులతో జర్మనీ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?