తబ్లిగీలపై సీబీఐ విచారణ అక్కర్లేదు: కేంద్రం
దిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశంపై సీబీఐ విచారణ అక్కరలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. సంఘటన జరిగిన అనంతరం చేపట్టిన విచారణలో ప్రతి విషయంలో చట్టప్రకారమే నడుచుకున్నట్లు పేర్కొంటూ సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది
సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు..
దిల్లీ: దిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశంపై సీబీఐ విచారణ అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. సంఘటన జరిగిన అనంతరం చేపట్టిన విచారణలో ప్రతి విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటున్నట్లు తెలుపుతూ సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై దిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు చేపట్టిన విచారణ తుది దశకు చేరుకుందని.. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ఇచ్చిన గడువులోనే సమర్పించనుందని స్పష్టం చేసింది. తబ్లిగీ జమాత్ కార్యక్రమం విషయంలో దిల్లీ ప్రభుత్వంతోపాటు దిల్లీ పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రియా పండిత అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
మరోవైపు తబ్లిగీ జమాత్ ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. సీబీఐతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) కూడా దీనిపై విచారణ చేపట్టింది. విదేశాలనుంచి వచ్చి తబ్లిగీ జమాత్కు హాజరైన వారిపై దిల్లీ పోలీసులు కూడా కేసులు నమోదుచేసి కోర్టుల్లో పలు ఛార్జిషీట్లు కూడా వేశారు. తబ్లిగీ జమాత్ అధినేత మౌలానా సాద్పై ఐసీసీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రతకు దిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశం కేంద్ర బిందువైన విషయం తెలిసిందే. దీనిలో పాల్గొన్న విదేశీయుల్లో వందల మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరు దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్లడంతో వైరస్ విస్తృత వేగంతో అన్ని రాష్ట్రాలకు పాకింది.
ఇవీ చదవండి..
తబ్లిగీలకు భారత్లో నో ఎంట్రీ
భారత్లో 2లక్షలు దాటిన కేసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్