అలబామాలో కాల్పులు: ఏడుగురి మృతి

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఏడుగురు మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం...

Published : 05 Jun 2020 19:57 IST

వాల్హెర్మోసో స్ప్రింగ్స్: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఏడుగురు మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి పదకొండు గంటల ప్రాంత్రంలో కాల్పులు ఘటన జరిగినట్లు మోర్గాన్‌ కౌంటి షరీఫ్ తెలిపారు. 

మోర్గాన్‌ కౌంటీ ప్రాంతంలోని వాల్హెర్మోసో స్ర్పింగ్స్‌లో ఓ ఇంట్లో కాల్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం అదడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ ఇంటికి మంటలు అంటుకోవడంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చి.. లోనికి వెళ్లి చూడగా ఏడుగురు మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని