కరోనాతో మహిళ మృతి.. 91మందికి క్వారంటైన్
ముంబయి నుంచి రైలులో వచ్చిన ఓ 65 ఏళ్ల మహిళ జైపూర్ రైల్వేస్టేషన్లో కరోనాతో మృతి చెందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆమెతో పాటు ఆ బోగీలో ప్రయాణించిన 91మందిని క్వారంటైన్ కేంద్రాలకు
జైపూర్: ముంబయి నుంచి రైలులో వచ్చిన ఓ 65 ఏళ్ల మహిళ జైపూర్ రైల్వేస్టేషన్లో కరోనాతో మృతి చెందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆమెతో పాటు ఆ బోగీలో ప్రయాణించిన 91మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ ముంబయి నుంచి జైపూర్కు రైలులో ప్రయాణించింది. గురువారం జైపూర్ రైల్వేస్టేషన్కు చేరుకున్న ఆమె.. ప్లాట్ఫాం మీద సొమ్మసిల్లి పడిపోయింది. ప్రాథమిక చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిబంధనల ప్రకారం అధికారులు ఆమె మృతదేహం నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. శుక్రవారం వెలువడిన నివేదికల్లో ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆమె వద్ద ఫోన్, ఎలాంటి గుర్తింపుకార్డు లేవని, వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ముంబయి రైల్వేస్టేషన్లో ఆమెను సరిగ్గా పరీక్షించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక అధికారులు చెప్పారు. ఆమెతో పాటు ఆ బోగీలో ప్రయాణించిన 91మందిని క్వారంటైన్కు తరలించామన్నారు.
రాజస్థాన్లో తాజాగా 222 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 10,084కు చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన బులిటెన్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని