నిబంధనలు ఉల్లంఘన.. ప్రముఖ ఆస్పత్రిపై కేసు

కొవిడ్‌-19కు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దిల్లీలోని ప్రముఖ సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిపై కేసు నమోదైంది. దిల్లీ వైద్యారోగ్యశాఖకు చెందిన అధికారి ఫిర్యాదు...

Published : 06 Jun 2020 22:10 IST

దిల్లీ: కొవిడ్‌-19కు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దిల్లీలోని ప్రముఖ ఆసుపత్రి సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిపై కేసు నమోదైంది. దిల్లీ వైద్యారోగ్యశాఖకు చెందిన అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సుమారు 675 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిని జూన్‌ 3న కొవిడ్‌-19 సేవలు అందించేందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఆస్పత్రి యాజమాన్యం ఉత్తర్వులను బేఖాతరు చేసిందంటూ ఇచ్చిన ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు కేసు నమోదు చేశారు.

కొవిడ్‌-19 పరీక్షలకు ఆర్‌టీ-పీసీఆర్‌ యాప్‌ను వినియోగించకపోవడమే కారణమని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం శాంపిళ్లను సేకరించే ల్యాబ్స్‌ తప్పనిసరిగా ఈ యాప్‌ను వాడాల్సి ఉంది. సదరు ఆస్పత్రి ఆ యాప్‌ను వినియోగించకపోవడంతో అంటు వ్యాధుల చట్టం 1897 కింద కొవిడ్‌ -19 నిబంధనలు పాటించని కారణంగా కేసు నమోదు చేశారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ ఈ యాప్‌ను తీసుకురాగా.. దిల్లీ ప్రభుత్వం యాప్‌ వాడకాన్ని తప్పనిసరి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు