గాంధీ విగ్రహ అపవిత్రంపై స్పందించిన ట్రంప్
అమెరికాలో ఇటీవల జరిగిన జాత్యహంకార వ్యతిరేక నిరసనల్లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపవిత్రం చేయడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు........
వాషింగ్టన్: అమెరికాలో ఇటీవల జరిగిన జాత్యహంకార వ్యతిరేక నిరసనల్లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపవిత్రం చేయడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీన్ని అవమానకరమైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్లోని భారత రాయబారి కార్యాలయం వెలుపల మహాత్మాగాంధీ విగ్రహాన్ని జూన్ 2న అర్ధరాత్రి దుండగులు అపవిత్రం చేసిన విషయం తెలిసిందే. ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్.. పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోవడంపై వ్యక్తమైన ఆందోళనల్లో భాగంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. విగ్రహంపై రాతలు రాసి, నల్లరంగు పులిమారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం.. అమెరికా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది. స్థానిక పోలీసులకూ ఫిర్యాదు చేసింది. గాంధీ విగ్రహంపై దుండగుల దుశ్చర్య విషయంలో భారత్ను అమెరికా క్షమాపణలు కోరింది. విగ్రహ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
ఫిబ్రవరిలో భారత పర్యటన సందర్భంగా ట్రంప్ ఆయన సతీమణి మెలనియాతో కలిసి సబర్మతీలోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు గాంధీ ఉపయోగించిన రాట్నాన్ని పరిశీలించి.. దాని పనితీరును ప్రధాని మోదీని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలు వైట్ హౌస్ గోడలపై కూడా కనిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!