కరోనా పరీక్షల్లో కేజ్రీవాల్‌కు నెగటివ్‌ 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని నిర్ధారణ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం ఆయన నుంచి నమూనాలను...

Published : 09 Jun 2020 19:10 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షల్లో నెగటివ్ అని నిర్ధారణ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం ఆయన నుంచి నమూనాలను సేకరించిన వైద్య బృందం వాటిని కరోనా పరీక్షలకు పంపారు. పరీక్షల ఫలితాల్లో నెగటివ్‌ అని తేలిందని, ఆయనలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యాధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా జ్వరం, గొంతునొప్పి, తదితర కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండటంతో సోమవారం ఆయన స్వీయనిర్భంధంలోకి వెళ్లారు. కేజ్రీవాల్‌కు డయాబెటీస్‌ కూడా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేయించుకున్నట్లు ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

దేశరాజధానిలో గత కొద్ది రోజులుగా కరోనా తీవ్రత పెరగడంతో, సమూహ వ్యాప్తి ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా స్పష్టత ఇచ్చారు. దిల్లీలో సమూహ వ్యాప్తి లేనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 29,943 కేసులు నమోదుకాగా, వారిలో ఇప్పటివరకు 874 మంది మృత్యువాతపడ్డారు. రాబోయే రెండు వారాల్లో కేసుల సంఖ్య 56 వేలకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని