అవును చైనా ఆక్రమించింది: లద్దాఖ్ ఎంపీ
గత కొద్ది రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమయ్యారు....
దిల్లీ: గత కొద్ది రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో లద్దాఖ్లోని భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించారు. రాహుల్ ట్వీట్పై లద్దాఖ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ స్పందించారు. కాంగ్రెస్ హయాంలోనే చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుందని, ఇందుకు తగిన ఆధారాలు అంటూ పలు సందర్భాల్లో చైనా ఆక్రమించిన ప్రదేశాలను సూచిస్తూ ఫొటో, దానికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు.
‘‘రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు నేను ట్వీట్లో పేర్కొన్న ఆధారాలతో అంగీకరిస్తారని భావిస్తున్నాను. ఇక మీదట వారు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించరని అనుకుంటున్నా’’ అని జమ్యాంగ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇందులో ఆయన రాహుల్ గాంధీ ప్రశ్నకు బదులిస్తూ ‘‘అవును చైనా భారత్ను ఆక్రమించింది. 1962లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 37 వేల చదరపు కిలోమీటర్ల ఆక్సాయి చిన్ భూభాగాన్ని, 2008 యూపీఏ పాలనలో చుమూర్లోని టియా పాంగ్నాక్, ఛాబ్జి వ్యాలీ ప్రాంతాలను ఆక్రమించింది. దెమ్చోక్లోని జోరావర్ ఫోర్ట్ను 2008లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నాశనం చేసింది. ఆ ప్రాంతంలో పీఎల్ఏ 2012లో పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, కొత్తగా చైనీస్ దెమ్చోక్ కాలనీ పేరుతో 13 సిమెంట్ ఇళ్లు నిర్మించింది. ఈ రెండు ఘటనలు కూడా యూపీఏ హయాంలోనే జరిగాయి. 2008-2009 యూపీఏ పాలనలో భారత్ దుంగ్తి, దెమ్చోక్ మధ్య ఉన్న పురాతన వ్యాపార కేంద్రం డూమ్ చిలీని కూడా కోల్పోయింది’’ అని అందుకు సంబంధించిన ప్రదేశాలను సూచిస్తూ ఫొటోను జోడించారు.
జమ్యాంగ్ ట్వీట్ తర్వాత బుధవారం రాహుల్ గాంధీ మరో మారు ప్రధాని నరేంద్ర మోదీపై ట్విటర్లో విమర్శలు చేశారు.‘‘చైనీయులు లద్దాఖ్లోని మన భూభాగంలోకి ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ ప్రధాని మాత్రం దీనిపై మౌనంగా ఉన్నారు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. మంగళవారం తూర్పు లద్దాఖ్లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో మూడు చోట్ల చైనా తన బలగాలను వెనక్కి తీసుకుంది. ప్రతిగా భారత్ కూడా ఆయా ప్రాంతాల్లో తన సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను మరింత తగ్గించేందుకు బుధవారం మరోసారి ఇరు దేశాలకు చెందిన మేజర్ జనరల్ స్థాయి అధికారులు చర్చలు జరపనున్నారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?