మనకు కష్టంగా ఉన్నా.. జపాన్లో కామన్!
కొన్ని నెలల క్రితం వరకు ఆపరేషన్ సమయంలో డాక్టర్లు మాత్రమే సర్జికల్ మాస్క్ను ధరించేవాళ్లు. కానీ కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు ప్రజలంతా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి వస్తుంది. బయటకు వస్తే మాస్క్ ధరించాల్సిందేనని, లేకపోతే జరిమానా విధిస్తామని ప్రభుత్వాలే హెచ్చరించే స్థితికి వచ్చింది. ఇలా మాస్క్ ధరించి
కొన్ని నెలల క్రితం వరకు ఆపరేషన్ సమయంలో డాక్టర్లు మాత్రమే సర్జికల్ మాస్క్ను ధరించేవాళ్లు. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు ప్రజలంతా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి వస్తోంది. బయటకు వస్తే మాస్క్ ధరించాల్సిందేనని, లేకపోతే జరిమానా విధిస్తామని ప్రభుత్వాలే హెచ్చరించే స్థితికి వచ్చింది. ఇలా మాస్క్ ధరించి బయటకువెళ్లడం మనకు కొత్తగా.. కాస్త ఇబ్బందిగా ఉన్నా.. జపాన్లో మాత్రం సర్వసాధారణం. కరోనా సమయంలోనే కాదు.. దానికి ముందు నుంచే జపాన్ ప్రజలు రోజూ వివిధ సందర్భాల్లో మాస్కులు ధరిస్తుంటారు. ఎందుకు అంటారా? మీరే చదవండి...
కొంచెం అనారోగ్యంగా ఉన్నా..
జలుబుతో బాధపడుతున్నప్పుడు తుమ్ము వస్తే.. మనం రుమాలు లేదా చేతిని అడ్డుపెట్టుకుంటాం. కానీ జపాన్ ప్రజలు జలుబు తగ్గే వరకు మాస్క్ ధరిస్తారు. అక్కడి ప్రజలు వ్యక్తిగతంగానే కాదు.. సమాజం విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అందుకే వారి వల్ల ఇతరులకు జలుబు రాకూడదని జాగ్రత్త వహిస్తారు. కేవలం జలుబు అనే కాదు.. ఏ కొంచెం అనారోగ్యానికి గురైనా మాస్క్ తప్పనిసరిగా ధరిస్తారు.
వసంతకాలం.. వారికి మహా డేంజర్
వసంతకాలంలో చెట్లు చిగురించి పూలు పూస్తాయి. ఆ పూల పుప్పొడి రేణువులను గాలిలో కలవడం వల్ల జపాన్లో అనేక మంది అలెర్జీకి గురవుతుంటారు. దీని నుంచి తప్పించుకునేందుకు అక్కడి వాళ్లు మాస్క్ను ధరిస్తుంటారు. ఏయే ప్రాంతాల్లో గాల్లో పుప్పొడి రేణువుల శాతం ఎంత ఉందో వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తుందంటే.. ఏ స్థాయిలో అలర్జీతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వాతావారణ శాఖ ఇచ్చే సమాచారం ప్రకారం.. వారు మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్తుంటారు.
వంటల వద్ద తప్పదు మాస్క్
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రెస్టారెంట్లలో వంటశాల, వంటలు చేసేవాళ్లు శుభ్రంగా ఉండాలి. శుభ్రతను పరిశీలించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అధికారులు ఉంటారు. అయినా అనేక చోట్ల ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా వంటలు చేస్తుంటారు. కానీ జపాన్లో అలా కుదరదు. రెస్టారెంట్లలో వంటలు చేసేవారు, వడ్డించేవారు కచ్చితంగా మాస్క్ ధరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే సమయంలోనూ సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరిస్తారు.
చలికాలం.. వెచ్చదనం కోసం
జపాన్లో శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో వెచ్చదనం కోసం చాలా మంది సర్జికల్ మాస్క్ను ధరిస్తారు. అది ముఖాన్ని వెచ్చగా ఉంచుతుంది. బయటి చలి, పొడి గాలి నుంచి రక్షణ కల్పించడంతోపాటు.. ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మాస్క్ తేమను ఏర్పరుస్తుంది. అది గొంతు తడారకుండా చూస్తుంది.
మేకప్ లేకపోతే మాస్కే
జపాన్లో అమ్మాయిలు మేకప్ వేసుకోనప్పుడు ఈ మాస్కులు ధరించి బయటకు వెళ్తుంటారట. ఎందుకంటే ఈ మాస్క్ వారి మేకప్లేని ముఖాన్ని కనిపించకుండా చేస్తుందట. జపాన్లో అందరూ సమయపాలన పాటిస్తారు. ఎప్పుడైనా మేకప్ వేసుకోవడానికి సమయం లేకపోతే ఈ మాస్క్ను ధరించి కవర్ చేస్తారట. అలాగే ముఖంపై మొటిమలు, స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు అవి కనిపించకూడదని మాస్క్ను పెట్టుకుంటారట. అక్కడ మగవాళ్లు ఎప్పుడు గడ్డం గీసుకొని నీట్గా కనిపిస్తుంటారు. ఎప్పుడైన సమయం లేక గడ్డం తీసుకోలేకపోతే.. మాస్క్ను ధరించి గడ్డం కనిపించకుండా జాగ్రత్త పడతారట. మాస్క్ ఆరోగ్యానికే కాదు.. సౌందర్యం విషయంలోనూ ఉపయోగపడుతుందన్నమాట.
సమాజానికి దూరంగా ఉండాలని
ఎదుటి వ్యక్తుల్ని చూడటంతోనే వారిని జడ్జ్ చేసే అలవాటు జపాన్లో అధికం. దీంతో ముభావంగా, నిస్పృహతో ఉండే వ్యక్తులు, సిగ్గు ఎక్కువగా ఉండే వాళ్లు తమ భావాలను ఎదుటివారితో పంచుకోవడానికి ఇష్టపడరు. నిజానికి సమాజానికి దూరంగా ఉండాలని భావిస్తుంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి వారికి తమ ముఖం కనిపించకుండా మాస్కును ధరిస్తారు. గందరగోళ ప్రపంచంతో పోటీ పడలేక ఆత్మరక్షణలా మాస్క్ను ఉపయోగిస్తుంటారు.
అన్ని చోట్లాలాగే.. కానీ చాలా నిబద్ధతతో..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది మాస్క్ ధరించాలి. అది ఆరోగ్య పరిరక్షణలో ప్రాథమిక అంశం. కానీ మన దగ్గర సాధారణ చికిత్స సమయంలో వైద్య సిబ్బంది పెద్దగా మాస్కులు ధరించరు. కానీ జపాన్లో వైద్యులు, వైద్య సిబ్బంది అన్ని వేళలా కచ్చితంగా మాస్కులు ధరిస్తారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.