భారతీయులపై నేపాల్ పోలీసుల కాల్పులు
నేపాలీ పోలీసులు భారత ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడడంతో ఒకరు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన..
ఒకరి మృతి, నలుగురికి గాయాలు
దిల్లీ: భారత్కు చెందిన పౌరులపై నేపాల్ బోర్డర్ పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బిహార్లోని సీతామర్హి జిల్లాలోని నేపాల్ సరిహద్దుల్లో జరిగింది. నేపాల్ పోలీసులు, స్థానిక భారతీయుల మధ్య స్వల్ప వివాదం అనంతరం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో వికేష్కుమార్ రాయ్ (25) అనే యువకుడు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా సమీప పంటపొలాల్లో పనులు చేసుకుంటున్న నలుగురికి తూటాలు తగిలాయి. లగాన్ యాదవ్ అనే మరో వ్యక్తిని నేపాలీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సరిహద్దులోకి ప్రవేశించిన కొందరు తమ ఆయుధాలను అపహరించారని, దీంతో తొలుత గాల్లోకి కాల్పులు జరిపామని, అనంతరం కాల్పులు జరపాల్సి వచ్చిందని నేపాల్ పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేశ్ చంద్ర తెలిపారు. ఉదయం 8.40 గంటలకు ఈ ఘటన జరిగిందని, వెంటనే తమ కమాండర్లు నేపాల్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. మృతుడు వికేష్ కుమార్ తండ్రి మాట్లాడుతూ.. నేపాల్లోని నారాయణ్పుర్లో అతడి పంటపొలాలు ఉన్నాయని, అక్కడే తన కుమారుడు పనిచేస్తున్నట్లు వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!