యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌తో 30నిమిషాల్లోనే ఫలితం!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు భారీగా బయటపడుతుండడంతో నిర్ధారణ పరీక్షలు కూడా భారీ సంఖ్యలో అనివార్యమయ్యాయి. దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌-19 నిర్ధారణ కోసం ఎక్కువగా ఆర్‌టీ-పీసీఆర్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే, తాజాగా యాంటిజెన్‌ టెస్ట్‌కిట్‌ ఫలితాలను కూడా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌), ఎయిమ్స్‌ ధ్రువీకరించాయి.

Published : 15 Jun 2020 18:54 IST

తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన ఐసీఎంఆర్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు భారీగా బయటపడుతుండడంతో పరీక్షలు కూడా భారీ సంఖ్యలో అనివార్యమయ్యాయి. దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌-19 నిర్ధారణ కోసం ఎక్కువగా ఆర్‌టీ-పీసీఆర్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే, తాజాగా యాంటిజెన్‌ టెస్ట్‌కిట్‌ ఫలితాలను కూడా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌), ఎయిమ్స్‌ ధ్రువీకరించాయి. వీటికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను ఐసీఎంఆర్‌ విడుదల చేసింది. 

దక్షిణ కొరియాకు చెందిన ఈ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా కేవలం 30నిమిషాల్లోనే ఫలితం తేలనుంది. అయితే, ఈ విధానంలో పాజిటివ్‌ వస్తే మాత్రం దాన్ని పాజిటివ్‌ కేసుగానే పరిగణిస్తారు. తిరిగి రెండోసారి పరీక్షించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫలితం నెగెటివ్‌ వస్తే మాత్రం నిర్ధారణ కోసం మళ్లీ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేసి ధ్రువీకరించుకోవాలని ఐసీఎంఆర్‌ తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వైరస్‌ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దీని ద్వారా పరీక్షిస్తే ఫలితం చాలా తొందరగా వెలుబడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, గడచిన 24గంటల్లో దేశంలో 1,15,519 శాంపిళ్లను ఐసీఎంఆర్‌ పరీక్షించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 57,74,133 శాంపిళ్లకు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు