కరోనా కాలం: సైకిళ్లకు భారీ డిమాండ్!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణతో చాలా దేశాల్లో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిమ్లు మూతపడ్డాయి. వ్యాయామం, కాలినడక కోసం కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల్లో చూడనివిధంగా ఒకేసారి సైకిళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
పెరిగిన డిమాండ్తో సైకిళ్ల కొరత
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణతో చాలా దేశాల్లో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిమ్లు మూతపడ్డాయి. వ్యాయామం, కాలినడక కోసం కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల్లో చూడనివిధంగా ఒకేసారి సైకిళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలో అతిపెద్ద రిటైల్ మార్కెట్ వాల్మార్ట్, టార్గెట్ కేంద్రాలలో ఉన్న సైకిళ్ల ర్యాక్లన్నీ ఖాళీ అయ్యాయి. అంతేకాకుండా, చిన్న షాపుల్లోని సైకిళ్లు కూడా దాదాపు అమ్ముడుపోయాయి. అయితే, మహమ్మారి విజృంభణ కారణంగా అమెరికాలో గత రెండు నెలలుగా ఏర్పడ్డ చమురు సంక్షోభంతో సైకిల్ విక్రయాలు భారీగా పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాక్డౌన్లతో భారీ డిమాండ్..
అమెరికాలో వైరస్ విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో నిత్యావసర వస్తువుల కోసం ఎగబడినట్లుగా ప్రస్తుతం వీటికోసం పరుగెడుతున్నట్లు సైకిల్ ఇండస్ట్రీ నిపుణులు జయ్ టౌన్లీ తెలిపారు. ముఖ్యంగా చిన్నారుల సైకిళ్ల కంటే పెద్దవారు వాడే సైకిళ్లు, ఈ-బైకుల విక్రయాలు మూడింతలు పెరిగాయని మార్కెట్ విశ్లేషణ సంస్థ ఎన్పీడీ గ్రూప్ వెల్లడించింది. ఇక చిన్నారులు వాడే ఎలక్ట్రిక్ బైకుల విక్రయం కూడా రెట్టింపు అయినట్లు తెలిపింది. ఇలా స్వల్ప కాలంలోనే భారీగా డిమాండ్ పెరగడంతో అమెరికాలో సైకిళ్లకు భారీ కొరత ఏర్పడింది. అమెరికాలో లభించే దాదాపు 90శాతం సైకిళ్లు చైనా నుంచే దిగుమతి అవుతాయి. ప్రస్తుతం అక్కడ పూర్తిగా స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ఈ కొరత ఏర్పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి..
కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. మనీలా, రోమ్ నగరాల్లో కార్లను పార్కు చేసినట్లుగా ప్రస్తుతం భారీగా సైకిల్ పార్కింగ్లతో వీధులు నిండిపోతున్నాయి. ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రజలు సైకిళ్లవైపు మళ్లడమే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిలోభాగంగా, నగరంలో కొన్ని ప్రాంతాల్లో కార్లనే నిషేధించే దిశగా లండన్ మునిసిపాలిటీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇక ఫిలిప్పైన్స్లో సాధారణంగా క్రిస్మస్ సమయంలోనే బైకుల విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. లాక్డౌన్ అనంతరం ఇటలీలో ప్రభుత్వం బైకుల కొనుగోలుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాలో 138శాతం, బ్రిటన్లో 184శాతం తమ సైకిళ్ల అమ్మకాలు పెరిగాయని నెదర్లాండ్స్కు చెందిన ఈ-బైకర్ కంపెనీ వ్యాన్మూఫ్ వెల్లడించింది. దీంతో ఉత్పత్తి భారీగా పెంచినప్పటికీ డిమాండ్ను అధిగమించేందుకు మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చని తెలిపింది. బెల్జియంకు చెందిన మరో ఈ-బైకర్ కంపెనీ కౌబాయ్ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే సైకిళ్లతో పాటు ఈ-బైకులకు భారీ డిమాండు ఏర్పడడానికి పలు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
* ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణతో ప్రజారవాణ వ్యవస్థలకు దూరంగా ఉండటం
* కరోనా కారణంగా వ్యాయామంకోసం జిమ్లకు వెళ్లలేకపోవడం
* లాక్డౌన్లో ఇళ్లకే పరిమితమైన సమయంలో తమ పిల్లలు ఉత్సహం, వ్యాయామం కోసం సైకిళ్లు వాడటం
* మార్కెట్కు, ఆఫీసులకు వెళ్లేందుకు ఈ-బైక్లను వినియోగించడం
* భౌతిక దూరం పాటించడం కోసం సైకిళ్లు వాడటం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!