పాట్రిక్..నీది స్వచ్ఛమైన హృదయం..
అమెరికాలోని మినియాపొలిస్లో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసిస్తూ, జాతి వివక్షకు వ్యతిరేకంగా కొందరు నల్ల జాతీయులు అక్కడ నిరసనలు...
లండన్: అది లండన్ నగరంలోని వాటర్లూ బ్రిడ్జ్ ప్రాంతం.. అమెరికాలోని మినియాపొలిస్లో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసిస్తూ, జాతి వివక్షకు వ్యతిరేకంగా కొందరు నల్ల జాతీయులు అక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఇంతలో వారికి వ్యతిరేకంగా సంప్రదాయ వాదులు కొందరు ఆందోళన చేపట్టారు. పోటాపోటీగా రెండు గ్రూపులు నినాదాలు చేస్తున్నాయి... అంతలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట మొదలైంది.
ఈ గందరగోళంలో ఒక వ్యక్తి కిందపడి గాయపడ్డాడు. అయితే గాయపడిన వ్యక్తిని భుజాన వేసుకొని పాట్రిక్ హచిన్సన్ అనే వ్యక్తి వైద్యం సహాయం కోసం వేగంగా నడుచుకుంటూ వెళుతున్నాడు. ‘‘మేం చేసేది ఇది కాదు’’అని అరుస్తూ పాట్రిక్ గుంపులోంచి ముందుకు సాగుతున్నాడు. అయితే గాయపడిన వ్యక్తిని భుజాలపై మోసుకెళ్తున్న పాట్రిక్ను అక్కడున్న వారంతా ఒకింత ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎందుకంటే.. గాయపడిన వ్యక్తి ఒక శ్వేత జాతీయుడు..అతణ్ని మోసుకెళ్తున్న పాట్రిక్ నల్ల జాతీయుడు.
శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఫొటోను రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ డైలాన్ మార్టినెజ్ తన కెమెరాలో బంధించారు. తర్వాత అన్ని వార్తా, సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో విపరీతంగా వైరల్ అయింది. ఫొటో తీసినందుకు డైలాన్ను, పాట్రిక్ మానత్వాన్ని అభినందిస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. దీని గురించి పాట్రిక్ సహచరుడు మాట్లాడుతూ ‘‘వారు (సంప్రదాయ వాదులు) చేయాల్సింది అతను చేశాడు. అతణ్ని చంపకుండా కాపాడాడు’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా