భారత్-చైనా ఘర్షణపై విదేశీ మీడియా ఏమందంటే..
దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో గత ఆరు వారాలుగా నెలకొన్న ఘర్షణలు చివరకు ప్రాణనష్టానికి దారితీశాయి...
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో గత ఆరు వారాలుగా నెలకొన్న ఘర్షణలు చివరకు ప్రాణనష్టానికి దారితీశాయి. భారత్ వైపు 20 మంది సైనికులు వీరమరణం పొందారు. చైనా సైతం 43 మంది కోల్పోయినట్లు సమాచారం. రెండు అణ్వాయుధ దేశాల మధ్య దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. పరిస్థితులు చేదాటితే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. పలు అంతర్జాతీయ పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఈ పరిణామాలను ప్రముఖంగా ప్రచురించాయి. పరిస్థితులు మరింత దిగజారితే తలెత్తే పరిణామాలను విశ్లేషించాయి.
నిప్పు రాజేసిన చైనా..: న్యూయార్క్ టైమ్స్
‘‘ఇటీవల చైనా యుద్ధ వాహనాలు, ఆయుధ సామగ్రి, ట్రక్కులు, సైనికులను సరిహద్దు వెంట మోహరించింది. డ్రాగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్తతల్లో చైనా నిప్పు రాజేసినట్లైంది. తదనంతర పరిణామాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, భారత ప్రధాని మోదీ దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదం ఉంది’’ అని అమెరికా ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
గతంలో చర్చలతోనే సద్దుమణిగాయి, కానీ..: వాషింగ్టన్ పోస్ట్
‘‘1962 యుద్ధం మినహా తరచూ భారత్-చైనా మధ్య తలెత్తే వివాదాలు చర్చల ద్వారా పరిష్కారమయ్యేవి. కానీ, ఇటీవల రెండు దేశాల సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు’’ అంటూ ఎలాంటి విశ్లేషణను జోడించుకుండా వాషింగ్టన్ పోస్ట్ జరిగిన ఘటనను ప్రచురించింది.
నాలుగు దశాబ్దాల్లో ఒక్క తూటా పేలలేదు..: బీబీసీ
‘ఇండియా-చైనా క్లాష్: యన్ ఎక్స్ట్రార్డినరీ ఎస్కలేషన్ విత్ రాక్స్ అండ్ క్లబ్స్’ పేరిట బీబీసీ కథనం ప్రచురించింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ వెంట అనేక ప్రాంతాల్లో గస్తీ కాస్తూ ఒకరి భూభాగంలోకి ఒకరు దూసుకెళ్లారు. దీంతో అనేక సార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కానీ, నాలుగు దశాబ్దాల్లో ఒక్క తూటా పేలలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి’’ అని బీబీసీ పేర్కొంది.
విస్తరణ కాంక్ష ప్రమాదకరం..: ది గార్డియన్
‘‘ప్రపంచంలో అత్యంత ఉద్రిక్త ప్రాంతంగా ఉన్న భారత్-చైనా సరిహద్దుల్లో దళాలు కర్రలు, ఇనుపరాడ్లతో ఘర్షణకు దిగాయి. రెండూ అణ్వాయుధ దేశాలు కావడం గమనార్హం. ఈ పరిణామాలు విస్తరణ కాంక్ష వల్ల తలెత్తే ప్రమాదాన్ని ఎత్తిచూపుతున్నాయి’’ అంటూ పరోక్షంగా పొరుగు దేశాల భూభాగాల ఆక్రమణకు యత్నిస్తున్న చైనా విస్తరణ కాంక్షను ‘ది గార్డియన్’ పత్రిక చురకలంటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు